టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ నాయకుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. తెలంగాణ రైతాంగ సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు కవిత కౌంటర్ ఇవ్వగా…కవిత ట్వీట్ కు రేవంత్ కౌంటరిచ్చారు.
తెలంగాణ రైతు సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘‘ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ బాధ్యతను మరిచాయి. ఈ సమయంలో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతను క్షోభపెడుతున్నారు. ఇప్పటికైనా ప్రతీ గింజ కొనాలి. తెలంగాణలో రైతులు పండించిన చివరి గింజ కొనేవరకూ వారి పక్షాన కాంగ్రెస్ కొట్లాడు తీరుతుంది’’ అని తెలుగులో ట్వీట్ చేశారు రాహుల్.
https://twitter.com/RahulGandhi/status/1508656064731889666?s=20&t=O3ZDQxp47gHc5PVtwx1VRg
అయితే రాహుల్ ఈ ట్వీట్ కు కవిత కౌంటర్ ఇస్తూ… ‘‘మీరు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు.. మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉంది’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.
https://twitter.com/RaoKavitha/status/1508665945950416905?s=20&t=O3ZDQxp47gHc5PVtwx1VRg
ఇక కవిత ట్వీట్ కు సెటైర్ వేశారు రేవంత్… రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలేం పార్లమెంట్లో పోరాడడం లేదని రేవంత్ అన్నారు. సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని రీట్వీట్ చేశారు. అసలు రైతుల సమస్యలకు కారణమే కేసీఆర్ అని… ఇకపై ఎఫ్సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆరే గతంలో ఒప్పందంపై సంతకం చేశారని… మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు రైతుల మెడకు ఉరితాడైందని రేవంత్ ట్వీట్ చేశారు.
https://twitter.com/revanth_anumula/status/1508681102214709249?s=20&t=O3ZDQxp47gHc5PVtwx1VRg
https://twitter.com/revanth_anumula/status/1508733342149070854?s=20&t=O3ZDQxp47gHc5PVtwx1VRg
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)