గత కొన్ని రోజులుగా జాతీయ భాష విషయంలో కన్నడ స్టార్ హీరో కిచ్ఛా సుదీప్ కి, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది.
ఒక ఆడియో ఫంక్షన్ లో సుదీప్ మాట్లాడుతూ.. KGF, పుష్ప సహా ఇతర చిత్రాల పాన్-ఇండియా విజయాలపై స్పందిస్తూ, ‘హిందీ జాతీయ భాష కాదు, మేము దక్షిణ భారతదేశం నుంచి వచ్చినందున, వారు మా సినిమాలను ‘పాన్-ఇండియా’ అని పిలవడం ప్రారంభించారు. ఎందుకు హిందీ [సినిమా]ని పాన్-ఇండియాగా పిలుస్తున్నారు?” ఈరోజు ప్రేక్షకుల నుంచి వేటికి మంచి స్పందన వస్తోంది’’ అని కిచ్చా సుదీప్ ప్రశ్నించారు.
దీనిపై అజయ్ దేవగన్ స్పందిస్తూ.. మీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ మా మాతృభాష, అలాగే ఎప్పటికీ జాతీయ భాషగా ఉంది.. ఎల్లప్పుడూ ఉంటుంది.
జన గణ మన ” అని ట్వీట్ చేశారు.
దానిపై సుదీప్ స్పందిస్తూ, నేను అన్న సందర్భం.. మీరు అర్థం చేసుకున్నదాంట్లో చాలా భిన్నాభిప్రాయం ఉంది. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసుంటే ఎందుకు అలా అన్నానో చెప్పేవాడిని. ఇది ఎవరినో బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఏదైనా చర్చను ప్రారంభించడానికి కాదు” అని ట్వీట్ చేశారు. అంతటితో విషయం కాస్త సద్దుమణిగింది.
అయితే ఈ ట్విట్టర్ వార్ పై తనదైన శైలిలో స్పందించారు రామ్ గోపాల్ వర్మ. సౌత్ ఇండస్ట్రీ సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆడుతున్నందున అక్కడి స్టార్స్ అసూయతో ఉన్నారని అన్నారు. దక్షిణాది.. ఉత్తరాది కాదు.. భారతదేశం మొత్తం ఒక్కటే అని అందరూ తెలుసుకోవాలి అని అన్నారు. ప్రాంతీయత, అక్కడి సంస్కృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా భాషలు వృద్ధి చెందాయని, ప్రజలు దగ్గరవడానికి భాష దోహదపడుతుంది కానీ విడిపోవడానికి కాదనీ అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)