ట్విట్టర్ ఈసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తన్న వారిలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు లేఖలను పంపుతామని తెలిపింది. ఇప్పటికే కొన్ని కార్యాలయాలను మూసేశారు. అందరు ఉద్యోగుల బ్యాడ్జ్ లను సస్పెండ్ చేశారు. కొనసాగబోయేవాళ్లకు ట్విట్టర్ ఈ మెయిల్ ద్వారా, ఉద్యోగం నుంచి తొలగే వారికి పర్సనల్ మెయిల్ కు సమాచారం ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈమేరకు లేఆఫ్ ప్రణాళికపై చర్చించేందుకు టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల్లోని సన్నిహిత సహచరులతో ఎలన్ మస్క్ సమావేశమయ్యారని తెలిసింది. 3,738 మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి లేఆఫ్ ప్రారంభమవుతుందని ఉద్యోగులకు పంపించిన ఈ-మెయిల్లో ట్విటర్ తెలిపింది. అయితే ఎందరిని తొలగించాలనుకుంటున్నదీ దీనిలో లేదు. ట్విటర్ను సజావుగా నడపటం కోసమే ఈ మార్పులు అని… ఇప్పటివరకు ఉన్నవారంతా సంస్థకు తమ విలువైన సేవలు అందించినవారేనన్న మస్క్… కంపెనీ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు.
లేఆఫ్కు ముందు వరకు ట్విటర్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య దాదాపు 7 వేల 500. వారిలో సగం మంది తీసేస్తున్నారు.