లెఫ్ట్ వింగ్ కన్ను ఇక ట్విట్టర్ పై పడింది. ఈ సోషల్మీడియా ప్లాట్ ఫాంను ఎలోన్ మస్క్ కైవసం చేసుకున్నప్పటినుంచి వారికి కంటిమీద కునుకే పట్టడం లేదు. ట్విట్టర్ ను మరింతగా మెరుగుపరుస్తానంటూ, సరికొత్త ఫీచర్లతో అందరికీ అందుబాటులోకి తెస్తానని మస్క్ పదేపదే ప్రకటిస్తుంటే కొందరు లిబరల్స్, లెఫ్టిస్టులకు మింగుడు పడడం లేదు. ఎక్కడైనా, ఏదేశమైనా, ఏమూలనైనా పచ్చని వాతావరణాన్ని చెడగొట్టడం వారి హక్కుగా భావిస్తారు వామపక్షవాదులు. ట్విట్టర్ చేతులుమారి దానిమీద విస్తృతంగా చర్చ జరుగుతున్నవేళ రంగంలోకి దిగాయి ఉదారవాద, వామపక్ష సంస్థలు గుంపుగా.
ఉదారవాద వితరణశీలి జార్జ్ సోరస్ నిధులతో పూట గడుపుతున్న సంస్థలు కొన్ని ఉమ్మడిగా పలు దిగ్గజ కంపెనీలకు లేఖరాశాయి. వాటిలో మీడియాసంస్థలే ఎక్కువ ఉన్నాయి. ప్రసిద్ధ, అతిపెద్ద వాణిజ్య సంస్థలైన కోకాకోలా, డిస్నీ, క్రాఫ్ట్ వంటి కంపెనీలకు లేఖరాశారు. ట్విట్టర్లో ప్రకటనలు ఇవ్వద్దు, ట్విట్టర్ ఇప్పుడు పూర్తి విద్వేషపూరితమైన వేదిక అయిపోయింది. పారదర్శకతే లేకుండా పోయింది. మీరు కనుక ట్విట్టర్లో ప్రకటనలు ఇస్తే మీ పని అయిపోయినట్టే అన్నది లెఫ్ట్ వింగ్ అడ్వొకసీ గ్రూపు లేఖ సారాంశం.
అంతేకాదు ట్విట్టర్లో కలిసి సాగితే మీ బ్రాండ్ పట్ల ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుంది. అసలు మస్క్ వంటి కుట్ర సిద్ధాంతకర్త విస్తరించే ప్లాట్ ఫాంతో మీకేం పని.. ట్విట్టర్ తో మీ అనుబంధాన్ని కొనసాగించవద్దు. ఎలోన్ మస్క్ చేతికి వచ్చాక ట్విట్టర్ బ్రాండే పడిపోయింది. ఇంక అందులో మీరు ప్రకటనలు ఇస్తే మీమీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. మీ సొమ్మునూ నష్టపోతారు జాగ్రత్త అంటూ ఒకరకమైన హెచ్చరికజారీ చేసింది ఆ గ్రూపు. మీప్రకటన డాలర్లు మస్క్ వానిటీ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తాయి. లేదా అతని ఖాతాలోకి చేరిపోతాయి అంటూ వార్నింగ్ ఆ లెటర్లో. అంతేకాదు ట్విట్టర్లో ఎలాంటి మార్పులు వద్దని, పాత విధానాన్నే కొనసాగించాలనే డిమాండ్ నూ మస్క్ ముందు పెట్టాలనీ ఆలేఖలో ఉంది.
ఆ లేఖ రాసిన సంస్థల్లో మీడియా మేటర్స్ ఫర్ అమెరికా, బ్లాక్ లైవ్స్ మేటర్ గ్లోబల్ నెట్ వర్క్ ఫౌండేషన్, అకౌంటబుల్ టెక్, టెక్నాలజీ అడ్వకేసీ గ్రూప్, ఫెమినిస్ట్ గ్రూప్ అల్ట్రా వైలెట్, సెంటర్ ఫర్ కౌంటర్ డిజిటల్ హేట్, నేషనల్ హిస్పానిక్ మీడియా కూటమి వంటి 25 లెఫ్ట్ వింగ్ గ్రూపులున్నాయి. ఈ లేఖ రాసిన అడ్వొకేసీ గ్రూపుల్లోని ఫ్రీ ప్రెస్, మీడియా మేటర్స్ ఆఫ్ అమెరికాకు ఉదారవాద వితరణ శీలి, హంగేరి-అమెరికన్ అయిన జార్జ్ సోరస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి నిధులు పొందుతున్నాయి. ఆపిల్, బెస్ట్ బై, హెచ్బీవో వంటి పెద్ద బ్రాండ్లను లేఖలో లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టం అవుతోంది.
ఈ వామపక్ష మేథావుల సమూహానికి ట్విట్టర్ పై అంత అక్కసుకు కారణం… ట్విట్టర్లో ప్రకటనలపై కొన్ని మార్పులు చేయనున్నట్టు సూచన ప్రాయంగా ఎలోన్ మస్క్ చెప్పడమే. సోషల్మీడియా ప్లాట్ ఫాంను విస్తృత పరిచేందుకు కమర్షియల్, గవర్నమెంట్ వినియోగదారులకు ఫీ వసూలు చేస్తామన్నాడు మస్క్. అదే సమయంలో సాధారణ వినియోగదారులకు ట్విట్టర్ సర్వీస్ ఎల్లప్పుడూ ఉచితమేనని స్పష్టం చేశాడు.
దీనిపై సీఎన్ఎన్ నివేదికకు ప్రతిస్పందించాడు మస్క్. ఆ కథనాన్ని జోడిస్తూ ఈ సంస్థలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు. విచారణ చేద్దాం అని ట్వీట్ చేశాడు. ‘sunlight is the best disinfectant’.అని వ్యాఖ్యానించాడు. జార్జ్ సోరస్ ను లక్ష్యంగా మరికొన్ని ట్వీట్లు చేశాడు.
Sunlight is the best disinfectant
— Elon Musk (@elonmusk) May 3, 2022
ఆయా కంపెనీలకు లేఖ రాయడం వెనక జార్జ్ సోరస్ ఉన్నారని ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు స్పందించాడు ఎలోన్ మస్క్. జార్జ్ సోరస్ ను మెన్షన్ చేస్తూ మీకు మెసెజ్ చేశాను. DM చూడండి అంటూ ట్వీట్ చేశాడు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పోస్టుకు కూడా స్పందిస్తూ జార్జ్ సోరస్ నే అడుగుతాననని ట్వీట్ చేశాడు మస్క్. తన మెసేజ్ కి స్పందిస్తాడని ఆశిస్తూ…చూస్తాడనే అనుకుంటున్నా…అని జోడించాడు.
Here’s hoping🤞
— Elon Musk (@elonmusk) May 3, 2022
ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చినదగ్గర్నుంచే అనేక మార్పులు సూచించాడు ఎలోన్. ఇక బాధ్యత చేపట్టగానే మరింత వేగంగా ముందుకెళ్తున్నారు. సరికొత్త ఫీచర్లతో ట్విట్టర్ ను మరింత మెరుగుపరుస్తానని..పారదర్శకంగా ట్విట్టర్ ను తీర్చి దిద్దుతాననీ ముందు నుంచీ అంటున్నాడు మస్క్. అయితే ఇంతకాలం ట్విట్టర్ వేదిగ్గా విషం చిమ్ముతూ ఆడిందేఆట పాడిందే పాట అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చాయి కొన్ని లెఫ్ట్ సమూహాలు, వ్యక్తులు. ఇప్పుడు తమ వేషాలు సాగవని అర్థమైంది. అందుకే ట్విట్టర్ను, మస్క్ ను నష్టపరిచే కుట్ర చేస్తున్నాయి.
Twitter will always be free for casual users, but maybe a slight cost for commercial/government users
— Elon Musk (@elonmusk) May 3, 2022