ట్విట్టర్ ఆ ఖాతాలను బ్లాక్ చేసినట్లే చేసింది కానీ..
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్.. భారత ప్రభుత్వ ఆదేశాలను పాక్షికంగా అమలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై.. పాక్,ఖలిస్తాన్కు చెందిన దాదాపు వెయ్యికి పైగా ట్విట్టర్ అకౌంట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ సంస్థను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను ట్విట్టర్ సంస్థ అమలు చేయడం లేదు. కేవలం కొన్ని అకౌంట్లను మాత్రమే తొలగించినట్లు ట్విట్టర్ తెలిపింది. అది కూడా కేవలం భారత్ వరకు మాత్రమే పరిమితమని.. ఇతర దేశాల్లో ఆ అకౌంట్లు పనిచేస్తాయని వెల్లడించింది.
An update on our work to protect the public conversation in recent weeks in India. https://t.co/DNKjCup2j6
— X India (@XCorpIndia) February 10, 2021
కాగా, తాము మీడియా,జర్నలిస్టులు,ఉద్యమకారులు,రాజకీయ నాయకులకు సంబంధించిన అకౌంట్స్ జోలికి వెళ్లలేదని.. అది భారత చట్టాల ప్రకారం భావ ప్రకటన స్వేచ్చను ఉల్లంఘించడమే అవుతుందంటూ ట్విట్టర్ సంస్థ స్పష్టం చేసింది.