ట్విటర్ సి.ఇ.ఒ. నఖరాలు!
పిట్ట కొంచెం గోల ఘనం . ట్విటర్ ఇప్పుడు అశాంతి అరాచకాలను వ్యాపింపచేసే వేదికగా మారిందనే ఆరోపణలో నిజం ఉందనడానికి బోలెడు నిదర్శనాలున్నాయి. కంగనా రనౌత్ ట్వీట్లను డిలీట్ చేసిన ట్విటర్ వారు, పాప్ సింగర్ రిహనా ట్వీట్లకు వచ్చిన ప్రశంసలకు కితాబిచ్చారట. రిహానాకు అనుకూలంగా మహిళా జర్నలిస్టు చేసిన ట్వీటుకు ట్విటర్ సిఇఒ జాక్ డోర్సే లైక్ కొట్టాడట. “సుడాన్, నైజీరియా ఇప్పుడు భారత్ లో సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమాలకు రిహానా మద్దతు ప్రకటించారు. ఆమె ప్రాక్టికల్ గా ఉంటారు అనేది ఆ జర్నలిస్టు కామెంట్. బుద్ధీ జ్ఱానం లేని ఆ ట్వీట్ ను ట్విటర్ సిఇఒ లైక్ చేయడం హాస్యాస్పదం.
సుడాన్, నైజీరియా పరిస్థితిలతో భారతదేశాన్ని పోల్చిందంటేనే సదరు మహిళా జర్నలిస్టు అజ్ణానం బయటపడింది. పైగా సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఆందోళనట. జరుగుతున్న రైతుల పేరుతో నిరసన. అసలు రిహానా గానీ, సదరు మహిళా జర్నలిస్టు గానీ, ట్విటర్ సిఇఒ గానీ మూడు వ్వవసాయ చట్టాలను చదివారా? ఏమో అనుమానమే. మొత్తానికి ట్విటర్ సిఇఒ గారి డ్రామా చూసిన తర్వాత ఈ యాప్ ను వీలైనంత త్వరగా నిషేధించడం అవశ్యం అని జాతీయ వాదులు చెప్తున్నారు. వింటున్నారా మోడీజీ.