జమ్ములో జంట కారు బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఆగంతకులు కారులో ఐఈడీలు ఉంచి పేల్చినట్టు తెలిసింది. ఉదయం 10.47 కు ఒకకారులో , 10 నిమిషాలకు మరో కారులో బాంబు పేలింది.నార్వార్లోని ట్రాన్స్ పోర్ట్ నగర్ బస్ యార్డ్ సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడకు చేరుకున్నారు. రిపబ్లిక్ డే మరో నాలుగు రోజుల్లో ఉండటం, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆందరూ ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
https://twitter.com/ANI/status/1616684599408721920?s=20&t=8AeBIGfXsk6M1vCICOltZQ