ట్వీట్ కొట్టు- కోట్లు పట్టు: రైతుల పేరుతో నయా దందా
దాదాపు రెండున్నర కోట్ల జనాభా గల పంజాబ్ లో, సుమారు 40 లక్షల మంది రైతుల్లో నుంచి ఓ 10 శాతం మంది ఢిల్లీ శివార్లలో హైవేలమీద తిష్టవేసి ఆందోళన చేస్తున్నారు. మరికొందరు ఇతరులు కూడా అక్కడ తిష్టవేశారు. ఈ ఆందోళనకు ట్విటర్ ద్వారా మద్దతు తెలిపిన అమెరికన్ పాప్ సింగర్ రిహానాకు 2.5 మిలియన్ డాలర్ల నజరానా దక్కింది. ఇది ఎవరో గిట్టని వాళ్లు చెప్పిన మాట కాదు. బిజెపి వ్యతిరేక విద్వేషం వెళ్లగక్కుతూ, కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అండగా నిలిచే “ది ప్రింట్” వెబ్ పోర్టల్ కథనంలోని సారాంశం ఇది. ది ప్రింట్ పోర్టల్ లోకి వెళ్తే అది ఏ స్థాయిలో మోడీ ప్రభుత్వం మీద విషం కక్కుతుందో తెలుస్తుంది.
చదువూ సంధ్యా లేకుండా పర్యావరణ ఉద్యమం పేరుతో విషప్రచారం చేస్తూ, హటాత్తుగా ఎలా ప్రాచుర్యం పొందిందో తెలియని మతిలేని స్వీడన్ యువతి గ్రెటా థన్ బర్గ్. ఈమె కూడా రైతు ఆందోళనకు మద్దతు అంటూ ట్వీట్ తో పాటు టూట్ కిల్ లింక్ చేసి తర్వాత డిలీట్ చేసింది. ఈమెకు రిహానా అంత కాకపోయినా అందులో సగం మొత్తమైనా ముట్టి ఉంటుందని టాక్. అలాగే ఒక పోర్న్ స్టార్ కూడా రైతు ఆందోళనకు మద్దతు ప్రకటించింది. మరి ఆమెకు ఎంత సొమ్ము అందిందో తెలియదు.
కెనడాలో కూర్చుని ఖలిస్తాన్ పేరుతో నిధులు పోగుచేసి భారత్ లో హింసను ప్రేరేపించడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారు. ఎంపీ జగ్మీత్ సింగ్, అతడి బ్రాండింగ్ పార్ట్ నర్ మో ధలీవాల్, తదితరులు రెండేళ్ల పాటు ఢిల్లీ శివార్లలో ఆందోళనను స్పాన్సర్ చేస్తాం అంటున్నారు. ఆ మధ్య షాహీన్ బాగ్ లో డబ్బులు వెదజల్లి పాక్ అనుకూల సంస్థలు కృత్రిమ నిరసనలు చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిజమైన రైతులు తక్కువ, రైతులు కానివారే ఎక్కువగా కనిపించే ఆందోళనలో సిక్కుల వేషంలో పాల్గొనే వారికి భారీగానే డబ్బులు ఇస్తున్నారనేది మరో టాక్. ఇప్పటికీ ఈ ఆందోళన స్పాన్సర్ షిప్, ట్రాక్టర్ల కిరాయిలు వగైరాలకు వందల కోట్లు ఖర్చయ్యాయి. నిజమైన రైతుల్లో కొందరు తాము మోసపోయామని గుర్తించి ఇప్పటికే ఢిల్లీ శివార్ల నుంచి సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నవారిలో అన్నదాతల కంటే అన్యులే అనేక రెట్లు ఎక్కువన్నది ఇంటెలిజెన్స్ సమాచారమట.