భారత్-పాక్ సరిహద్దుల్లో ఓ బెలూన్ కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పేరుతో ఉన్న ఓ బెలూన్ టెన్షన్ వాతావరణాన్ని తీసుకొచ్చింది. హిరానగర్ సెక్టార్లోని సోత్రా చక్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అచ్చం పాక్ దేశీ విమానం మాదిరిగా ఉన్న ఈ ఎయిర్ బెలూన్ను చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రాజ్బాగ్ పోలీసులు సోత్రా చక్ గ్రామానికి చేరుకుని ఆ బెలూన్ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ బెలూన్కు చెందిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ బెలూన్పై చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేశారు. ఇది పాక్కు చెందిన లేటెస్ట్ టెక్నాలజీ ఫ్లైట్ అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు దీనిని మ్యూజియంలో భద్రపరచాలని కామెంట్ చేశారు. ఇంకొకరు ఏకంగా ఈ బెలూన్పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ వ్యాఖ్యలు చేశారు