అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కనులు చెవులుగా వ్యవహరించే విభాగమే జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం. దీనికి చీఫ్ గా వ్యవహరిస్తున్న తులసి గాబ్బర్డ్ ను సూపర్ కాప్ అనుకోవచ్చు. అమెరికా దేశపు భద్రతకు సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ కి సలహాలు ఇవ్వడం ఆమె పని. ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు ప్రపంచ స్థాయి అంశాలను ట్రంప్ కి నివేదిస్తూ ఉంటారు. ఇంత కీలకమైన పదవిలో ఉన్న తులసి గాబ్బర్ట్ మూలాలు భారత్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆమె అనేకసార్లు వెల్లడించారు కూడా.
..
జాతీయ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి చేపట్టిన కొద్ది రోజులకే తులసీ గాబ్బర్డ్ భారత్ కు రావటం విశేషం. ఇక్కడ మూడు రోజుల పాటు పర్యటించి వెళ్లారు. ఈ పర్యటనలో అనేక ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ను , ఆయన బ్రందాన్ని కలిసి వెళ్లారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భారత్, చుట్టు పక్కల దేశాల్లో జరుగుతున్న విషయాల్ని ఆమె అడిగి తెలుసుకొన్నారు.
…
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్… పాకిస్తాన్ చేస్తున్న పాడు పనుల గురించి ఆధారాలతో సహా బయట పెట్టేశారు. పాకిస్తాన్ అండదండలతో ఉగ్రవాద సంస్థలు పేట్రేగుతున్న తీరు గురించి సాక్షాదారాలు తులసి గాబర్ట్ తో ఆయన పంచుకున్నట్లు సమాచారం. ఇటువంటి చెత్త పనులను వదిలేస్తే.. అది సమాజానికి చేటు తెస్తాయి అని స్పష్టంగా చెప్పేసినట్లు తెలుస్తోంది. అజిత్ ధోవల్ అందించిన మెటీరియల్ తో తులసి గాబర్ట్ … స్పష్టత కు వచ్చినట్లు సమాచారం.
……
అందుచేత నే ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గడ్డ మీద నుంచే ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరిస్తోందని స్పష్టంగా చెప్పేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదం అన్న పదాన్ని ఆమె స్పష్టంగా తెలియచేయటం విశేషం. ఈ విషయం లో ఏమాత్రం మొహమాట పడలేదు. ఈ ఉగ్రవాదం సమస్యతో భారత్, అమెరికా రెండూ బాధలు పడుతున్నాయని కూడా ఆమె తేల్చి చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కు చెమటలు పట్టించే ప్రకటన ఇది అనుకోవచ్చు.
..
ఇప్పటికే పాకిస్తాన్ కు వచ్చే నిధులను అమెరికా దాదాపుగా నిలిపివేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించబోము అని ప్రకటించడం ద్వారా పాకిస్తాన్ కు చుక్కలు చూపించినట్లు అయింది.