కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తుగ్లక్ లాక్డౌన్ పెట్టిందంటూ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని అదుపు చేయడంతో విఫలమైందని విమర్శించారు. గంటలు మోగించాలని సూచించారని.. పళ్లెలాను మోగించడం వంటివి సూచించారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ప్రభుత్వం విఫలమై.. దేవుడిని ప్రార్ధించాలంటూ సూచించారని మోదీ సర్కార్ను ఎద్దేవా చేశారు. కాగా, గత వారం పది రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి.
https://twitter.com/RahulGandhi/status/1382907374063738883