వైకుంఠ ఏకాదశి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఆ రోజు దేశవిదేశాలనుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటిఅసౌకర్యం కలగకుండా చూడాలని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందినీ ఆదేశించారు ఈవో ధర్మారెడ్డి. అయితే వైకుంఠ ఏకాదశి రోజు టికెట్లు ఉన్నావారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. టికెట్లు లేనివాళ్లు కొండకు రావచ్చు తప్ప దర్శనానికి అనుమతి ఉండబోదన్నారు. ఇక జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని..11 వతేదీవరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం వేళ రోజుకు 25 వేల చొప్పున 300 రూపాయల టికెట్లు జారీ చేయనుంది టీటీడీ.