తెలంగాణాలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు చెందిన గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) నుంచి రూ. 500 కోట్ల విలువైన 300 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి మరో ఆర్డర్ను అందుకుంది. TSRTCకి 300 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు Olectra,EVEY (Evey Trans Private Ltd)కి లెటర్ ఆఫ్ అవార్డ్ (LoA) ఇచ్చారు, రెండూ హైదరాబాద్ ఆధారిత మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) గ్రూప్లో భాగమే.
భారత ప్రభుత్వ FAME-II (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం కింద 300 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్డర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ 300 E-బస్సులు 12 సంవత్సరాల వ్యవధిలో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC)/OPEX మోడల్ కింద అందనున్నాయి. EVEY బస్సులను Olectra Greentech Ltd నుంచి కొనుగోలు చేసి.. వాటిని 20 నెలలో అందిస్తుంది.