అనర్హులను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించారని…అందుకే తరచూ పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా కమిషన్ మారిందన్నారు. పేపర్ లీక్పై అధారాలు బయటపడితే తమపైనే కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శంకర్లక్ష్మి నేరం చేస్తే..ఆమెను సాక్షిగా పెట్టడం విడ్డూరమన్నారు. పేపర్ లీకేజీ కేసులో ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని వారిని తప్పించేందుకు సిట్ తో దర్యాప్తు చేయిస్తున్నారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు రేవంత్. ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ చెప్పారని మరి ఆ సమాచారం కేటీఆర్ కు ఎక్కడిదని నిలదీశారు.
దొంగలకు అడ్డాగా టీఎస్పీఎస్సీ – పేపర్ లీకేజీ వెనక ప్రభుత్వ పెద్దలు – రేవంత్ రెడ్డి
Share: