టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. అగ్రికల్చర్ పరీక్ష జూన్ 14, 15వ తేదీల్లో,…ఇంజినీరింగ్ ఎగ్జామ్ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 400, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 800 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గోవర్ధన్ తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)