జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై యూపీ మాజీ సీఎం మాయావతి స్పందించారు. దేశంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అందులో ఈ వ్యవహారం ఒకటని ఆమె అన్నారు. అసలు స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు గుడుల మీద దృష్టి ఎందుకని మండిపడ్డారు. నిరుద్యోగం ఓవైపు, ధరల పెరుగుదల మరోవైపు, ఇంకా చుట్టూ అనేక సమస్యలున్నాయని..అవి పక్కన పెట్టి విద్వేషపూరిత వాతావరణాన్ని ఆ పార్టీ సృష్టిస్తోందని మాయాఅన్నారు. దేశంలో ఉన్న శాంతిని ఆపార్టీ ధ్వంసం చేస్తోందని ఉద్దేశపూర్వకంగానే మతపరమైన అంశాలను తెరమీదకి తెస్తోందని అన్నారరు. ఇన్నేళ్లకు తాజ్ మహల్, జ్ఞానవాపి, మధుర, వారణాశి, ఇతర ఆలయాల గురించి ఎందుకు చర్చించాల్సి వస్తోందని కేంద్రంలోని బీజేపీ పాలకులనూ ఆమె నిలదీశారు.