ప్రధాని తెలంగాణను అవమానించారంటూ…పార్లమెంట్ బడ్దెట్ తొలివిడత సమావేశాల్ని బహిష్కరించింది టీఆర్ఎస్. రాష్ట్ర విభజనపై రెండు రోజుల క్రితం ప్రధాని మోదీచేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆపార్టీ ఎంపీలు మండిపడ్డారు. ప్రధాని మాటలు పార్లమెంటరీ వ్యవస్థను కూడా కించపరిచేలా ఉన్నాయంటూ మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులూ ఇచ్చారు.
‘‘పార్లమెంట్లో బిల్లు ఆమోదం సమయంలో సభ ఆర్డర్లో లేనపుడు తలుపులు ముస్తారు. అది రూల్స్లో ఉంది. ప్రధానికి వ్యతిరేకంగా ఎవరు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వరు. ప్రధానికి రూల్స్ తెలిసి ఉంటాయి కాబట్టి ప్రధానికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం మాకు కూడా బాధగానే ఉంది. తెలంగాణ ఏర్పాటులో సెంటిమెంట్ ఉంది. కాబట్టే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. అనేక మంది బలిదానాలు, ఉద్యమంతో తెలంగాణ సాధించుకున్నాం. ప్రధాని వ్యాఖ్యలను ఎవరు ఓర్చుకోలేరు. బాధతో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామనీ సీనియర్ ఎంపీ కేకే అన్నారు. సభా గౌరవం కోసం ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ ఇదని…. మా ప్రివిలేజ్ మోషన్పై కమిటీ నిర్ణయం తీసుకుంటుందనీ ఆయన అన్నారు. ప్రధాని క్షమాపణలు చెప్తారని భావిస్తున్నామని… ప్రివిలేజ్ మోషన్పై నిర్ణయం తీసుకునేవరకు సభకు వెళ్లబోమనీ ఎంపీలు స్పష్టం చేశారు.