దసరా సందర్భంగా కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానం కాపీని పార్టీ సీనియర్ నేత వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు అందజేశారు. ఆ కాపీని పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ధర్మేంద్ర చెప్పారని నాయకులువివరించారు. ఇక మునుగోడు ఉపఎన్నికలోగా పార్టీ పేరు మారితే దానిమీదే పోటీ చేస్తామని వినోద్ అన్నారు.
పరిశీలనలో ఏవైనా వివరణలు అవసరమైతే ఈసీ పార్టీని కోరుతుంది. పార్టీ పేరు మార్పుపై రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో రెండు ప్రధాన పత్రికల్లో ప్రకటన చేయాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే ఇక TRS..BRS పార్టీగా మారనుంది.
Today as per the instructions of Sri #KCR Garu, I have submitted the name change proposal of Telangana Rashtra Samiti (TRS) to Bharat Rashtra Samiti (BRS), to the Election Commission of India in New Delhi. pic.twitter.com/D30hushU5y
— B Vinod Kumar (@vinodboianpalli) October 6, 2022