తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతోన్నాయి. టీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి వలసలు జరుగుతోన్నాయి. తాజాగా ఈరోజు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపిపి తాడురి వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మా రెడ్డిలు బీజేపీలోకి చేరారు. ఈటల రాజేందర్ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.