తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సీనియర్ టీఆర్ఎస్ నేత, రైస్ మిల్లర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీ లో చేరారు. మొదటి నుంచి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. నిన్న యాదాద్రిలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 1500 మంది కార్యకర్తలతో యాదాద్రికి వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ముందు భారత్ ను ఏ విధంగా గొప్పగా నడిపిస్తున్నారో అందరికి తెలిసిందే.. వారి సారథ్యంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో వారు ముందుకెళ్తున్నారని ఆయనన్నారు.