కరోనా వ్యాప్తికిఅడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా…మే 2న ఎన్నికలఫలితాలు వెలువడే రోజు విజయోత్సవర్యాలీలపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. గెలిచిన పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి వేడుకలూ చేసుకోవద్దని స్పష్టం చేసింది. గెలిచిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారిన నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వారికో ఇద్దరికి మించి ఉండరాదనీ ఆంక్షలు పెట్టింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. బెంగాల్లో చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న ఉంది. మరోవైపు పోలింగ్ ప్రభావం పశ్చిమబెంగాల్ పై తీవ్రంగానే పడిందని చెప్పవచ్చు. అక్కడ కేసులు బాగా పెరిగాయి. అందుకే అన్ని రోడ్ షోలు, సభలు, పాదయాత్రలను ఈసీ నిషేధించింది.