త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇక 259 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 20మంది మహిళలు. త్రిపురలో వరుసగా మూడుదశాబ్దాల పాటు కమ్యూనిస్టుల పాలన సాగింది. 2018లో కమ్యూనిస్టులకు బీజేపీ బ్రేక్ వేస్తూ అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా విజయం తమదేననే ధీమాలో అధికార బీజేపీ ఉంది. ఆ పార్టీ ఐపీఎఫ్టీతో జట్టుకట్టి ఎన్నికల్లో పోటీచేసింది. అయితే పూర్వవైభవం కోసం కలలు కంటున్నసీపీఎం… ఈసారి కాంగ్రెస్తో చేతులు కలిపింది.నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది . ఆ ఎన్నిక కూడా ముగిశాక మార్చి 2న మూడు రాష్ట్రాల ఫలితాలూ వెలువడనున్నాయి.