దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరం నుండి బాంబు పేలుళ్లు జరిగిన రాజీవ్ చౌక్ (21 ఫిబ్రవరి 2013 రోజున) వరకు ATF( Anti Terrorism Forum) ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నాడు బాంబు పేలుళ్ళలో గాయపడిన బాధితులు , మరణించిన వారి కుటుంబ సభ్యులు మరియు విద్యార్డులు పాల్గొన్నారు . నాటి బాంబు పేలుళ్ళలో మరణించిన వారికి నివాళులు అర్పించిన అనంతరం ATF కన్వీనర్ రావినూతల శశిధర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఎలాంటి విద్రోహ కార్యక్రమాలు వెలుగు చూసినా దాని మూలాలు హైదరాబాద్ వైపు దారి తీయడం చూస్తుంటే ఉగ్రవాదులు హైదరాబాద్ ను షెల్టర్ జోన్ గా చేసుకున్నట్లు స్పష్టమవుతుందని , హైదరాబాద్ లోని స్థానిక రాజకీయ అండదండలతోనే ఉగ్రవాదులు యదేచ్ఛగా తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు గతంలో అనేక సందర్భాలలో బయటపడిందని, జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) వచ్చి అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన గోకుల్ఛాట్, లుంబినీ పార్క్, దిల్సుఖ్ నగర్ పేలుళ్ళలో మరణించిన మరియు గాయపడిన కుటుంబాలకు ఇప్పటి వరకూ ప్రభుత్వాల నుండి అందాల్సిన సాయం పూర్తి స్థాయిలో అందకపోవడం విచారకరమని, ఆ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్ లో పేలుళ్ళకు పాల్పడిన IM ఉగ్రవాదులకు NIA కోర్టు విధించిన మరణశిక్షను వెంటనే అమలు చేయాలని, ఉగ్రవాద మూలాలను ఏరివేయాలని ATF డిమాండ్ చేస్తుందని తెలిపారు.
ఈకార్యక్రమంలో ATF సభ్యులు బ్రహ్మచారి, నవీన్ , తదితరులు పాల్గొన్నారు .