అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిల్కూరు లక్ష్మి నగర్, హమాలివాడ, ఖుర్షీద్ నగర్, పుత్లి బౌలి PHC సెంటర్ల లో మహిళ మెడికల్ స్టాఫ్ డాక్టర్లు, నర్సులు, ANM లు సహా ఆశ కార్యకర్తలను కోవిడ్ సమయంలో వారు చేసిన సేవలకు గుర్తుగా వారిని శాలువాలతో సన్మానం చేశారు.
ఇంటికి పరిమితమైన మహిళ ఇల్లు, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే చేయటం అనేది గతం. ఈ ఆధునిక యుగంలో ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు వృతి వ్యాపారాల్లో సైతం మగవారికి ఎక్కడ తీసిపోరు. ఏ స్థాయిలో ఉన్నా కూడా గృహిణిగా పూర్తి బాధ్యతలు చేపట్టి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.
సామాజిక ఆరోగ్య కార్యకర్త (ASHA)లు భారతదేశ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) లో భాగంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అట్టడుగు వర్గాలను ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు అనుసంధానం చేయడమే వారి లక్ష్యం.
అయితే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేయడమే కాకుండా భారత ప్రధాని తలపెట్టిన యజ్ఞమైన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అందరూ తీసుకునేలా ఇంటింటికీ తిరిగి క్రియాశీలకంగా పనిచేశారు. ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి సేవలు అందించడం, ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర టార్గెట్ లను పూర్తి చేయడం ద్వారా ఎంతో తోడ్పడ్డారు. వారి సేవలకు గుర్తింపుగా మహిళా దినోత్సవం రోజు సన్మానం చేశారు బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి సంతోష్, నాయకురాలు కాంత, మోహన్ అగర్వాల్, వేణుగోపాల్, చిప్ప గంగన్న, లంక శీను, అశ్విన్,సతీష్, అనూప్ సహా నవీన్.