అంబేద్కర్ వర్దంతి సందర్భంగా దేశం ఆయనకు ఘన నివాళులు అర్పించింది. మహా పరినిర్వాస్ దివస్ గా ఆయన వర్దంతి దేశం జరుపుకుంది. పార్లమెంట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్ ఓం బిర్లా. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్షనేతలు సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా పలువురూ ఆయనకు నివాళులు అర్పించారు. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ 64 వవర్దంతిని నిర్వహించారు.
https://twitter.com/narendramodi/status/1599972270671564800?s=20&t=HVikhZf-362-tqZdR7IkxA