విజయ్ దివస్ సందర్భంగా నాటి పోరులో అమరులైన వీరులకు నివాళులర్పించింది దేశం. 1971లో జరిగిన ఆ యుద్ధం అన్యాయంపై న్యాయం, అమానుషత్వంపై మానవత్వం సాధించిన విజయమని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నాడు భారత సైన్యం చూపిన తెగువ మరువలేనిదన్నారు రాజ్ నాథ్. యుద్ధంలో అమరులైన జవాన్లకు ట్విట్టర్ ద్వారా ఆయన నివాళులు అర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఎట్ హోం నిర్వహించారు. ప్రముఖులు హాజరయ్యారు. నాడు పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించిన సందర్భాన్ని విజయ్ దివస్ గా జరుపుకుంటారు. నాటి యుద్ధంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్తాన్ లో మొదలైన పోరు…భారత్ -పాకిస్తాన్ యుద్ధానికి దారితీసింది.
https://twitter.com/rajnathsingh/status/1603630934699696128?s=20&t=Zzdwfi0xX3zelUXCNoaFCQ