సాంకేతికత ద్వారా ఆరోగ్య సంరక్షణను పెంపొందించే కాన్సెప్ట్ తో ట్రయల్ రన్ నిర్వహించారు. అందులో భాగంగా మందుల సరఫరాలో డ్రోన్ ల వినియోగంపై రిషికేష్ లో టెస్ట్ రన్ నిర్వహించారు. రెండు కిలోల బరువున్న మందులను తీసుకెళ్లిన డ్రోన్ 40 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో గమ్యానికి చేర్చింది. రిషికేష్ ఎయిమ్స్ ఆస్పత్రినుంచి గర్వాల్ జిల్లాలోని పర్వత ప్రాంతం టెహ్రీలోని ఓ ఆస్పత్రికి టీబీమందులను తీసుకెళ్లింది ఆ డ్రోన్. ఈ డ్రోన్ల వినియోగంతో మందుల సరఫరా వేగం రెండు గంటలనుంచి అరగంటకు తగ్గిందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవ్య అన్నారు.
https://twitter.com/MoHFW_INDIA/status/1626208469677404160?s=20