R&AW [రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ] ‘రా’ భారత గూడచారి సంస్థ. భారత దేశం తరుపున విదేశాల్లో గూఢచర్యం చేస్తుంటుంది . ఇది అన్ని దేశాలు చేసే పనే. 1990-92 లలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని రా లో పనిచేసిన భారత అధికారులు కొంతమంది ఆగష్టు,2017 న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ని కలిసి మాజీ ఉపరాష్ట్రపతి,అప్పట్లో ఇరాన్ లో భారత రాయబారిగా పనిచేసిన హమీద్ అన్సారీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ చట్ట పరమయిన విచారణ చేయాల్సిందిగా కోరుతూ ఒక వినతి పత్రం ఇచ్చారు. రా మాజీ అధికారుల ఆరోపణ ఏమిటంటే హమీద్ అన్సారీ ఇరాన్ లో రాయబారిగా ఉన్న సమయంలో అక్కడి రా కార్యకలాపాలు స్థభించి పోవడమే కాక రా అధికారులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికారు అని. వినతి పత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి.
1.1990 -92 రెండు సంవత్సరాలు ఇరాన్ లోని టెహ్రాన్ లో భారత రాయబారిగా పనిచేసారు హమీద్ అన్సారీ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేసి బదిలీ మీద ఇరాన్ వచ్చారు. హమీద్ అన్సారీ రాయబారిగా నియమించిన తరువాత ఇరాన్ లోని రా ఆపరేషన్స్ మరియు రా ఎజంట్స్ ఇరాన్ అధికారుల చేతిలో చిత్రహింసలు అనుభవించారు. హమీద్ అన్సారీ నమ్మక ద్రోహం , దేశద్రోహానికి ఎలా పాల్పడ్డాడో మొత్తం నాలుగు సంఘటనలని ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
2.మే 1991 లో భారత అధికారి సందీప్ కుమార్ ఇరాన్ లోని టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రాయం నుండి అనూహ్యంగా కిడ్నాప్ చేయబడ్డాడు. కిడ్నాప్ చేసింది ఇరాన్ గూఢ చారి సంస్థ అయిన ‘సవాక్ ‘[SAVAK]. ఇరాన్ లోని రా ఆపరేషన్ స్టేషన్ చీఫ్ అధికారిక పని మీద దుబాయి వెళ్ళాడు, విషయం తెలిసి వెంటనే టెహ్రాన్ చేరుకొని నేరుగా భారత రాయబార కార్యాలయానికి చేరుకొని హమీద్ అన్సారీని కలిసి ఇరాన్ గూఢ చారి సంస్థ సవాక్ మన ఏజెంట్ ని కిడ్నాప్ చేసిందని వెంటనే అధికారులతో మాట్లాడి విడిపించవలసినదిగా కోరాడు. కానీ హమీద్ అన్సారీ ఈ విషయం అసలు పట్టించు కోలేదు సరి కదా వెంటనే భారత్ లోని విదేశాంగ కార్యాలయానికి ఒక కాన్ఫిడేన్షియల్ రిపోర్ట్ ఇస్తూ దానిలో ఇరాన్లోని భారత అధికారి సందీప్ కుమార్ అదృశ్యం అయ్యాడని,అతని ప్రవర్తన సరిగా లేదని, ఒక ఇరాన్ మహిళతో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని అతన్ని తిరిగి భారత్ కి రప్పించండని కోరాడు కానీ ఇరాన్ లోని రా చీఫ్ కిడ్నాప్ విషయమయి తనని కలిసినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రస్తావించలేదు. భారత అధికారి కిడ్నాప్ అయిన మూడు రోజుల తరువాత ఒక అపరిచితుని నుండి భారత రాయబార కార్యాలయానికి ఫోన్ కాల్ వచ్చింది సందీప్ కపూర్ ఫలానా ప్రదేశంలో రోడ్డు పక్కన పడి ఉన్నాడని తీసుకెళ్ళండి అని. సందీప్ కపూర్ ని చిత్ర హింసలు పెట్టినా తన గుర్తింపుని చెప్పలేదు ఇరాన్ అధికారులకి మరి అతను రా ఆపరేటివ్ అని ఎవరు చెప్పారు ? హమీద్ ఇరాన్ అధికారులకి చెప్పాడు సందీప్ కపూర్ భారత రా ఏజెంట్ అని.కాగా సందీప్ కపూర్ కి మూడు రోజులపాటు డ్రగ్స్ ఎక్కించారు రక్తంలోకి. ఆ డ్రగ్స్ దుష్ప్రభావం నుండి బయటపడడానికి అయిదు సంవత్సరాలు పట్టింది సందీప్ కపూర్ కి. రా చీఫ్ తనే స్వయంగా ఇరాన్ అధికారులకి కంప్లైంట్ చేసినా ఫలితం లేదు ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం హామీద్ అన్సారి కంప్లైంట్ చేయాలి కానీ పట్టించుకోలేదు.
3. ఆగష్టు 1991, రా అధికారులు ఇరాన్ లోని కాశ్మీరీ యువకులు కొంత మంది ఒక మతపరమయిన ప్రదేశంలో [Qom] ఆయుధ శిక్షణ తీసుకుంటున్నట్లు గమనించారు. రా అధికారి D.B.మాధుర్ ఇలాంటి దేశ ద్రోహ పనులు చేయవద్దని మందలించి వదిలేశారు. ఇదే విషయాన్నీ తమ కొత్తగా వచ్చిన చీఫ్ కి తెలియచేసారు. హమీద్ అన్సారికి కొత్తగా వచ్చిన రా చీఫ్ ఈ ఆపరేషన్ విషయం, దానిని మాధుర్ నిర్వహిస్తున్నాడు అని చెప్పాడు.అంతే ! హమీద్ అన్సారీ వెంటనే ఇరాన్ అధికారులకి ఆపరేషన్ వివరాలు, రా అధికారి D.B.మాధుర్ పేరు కూడా చెప్పేశాడు.వివరాలు ఇరాన్ గూఢ చారి సంస్థ సవాక్ కి వెళ్ళిపోయాయి. మరుసటి రోజు ఉదయం మాధుర్ భారత రాయబార కార్యాలనికి నడుచుకుంటూ వస్తుండగా కిడ్నాప్ చేశారు. సాయంత్రానికి కానీ రా అధికారులకి మాధుర్ ని సవాక్ అధికారులు కిడ్నాప్ చేసినట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రా చీఫ్ హమీద్ అన్సారీ ని కలసి ఇరాన్ ఫారిన్ అధికారులకి విషయం తెలిపి మాధుర్ ని విడిపించమని కోరగా , హమీద్ ఎలాంటి చర్యలు తీసుకోపోగా తమ అధికారి మాధుర్ అదృశ్యం అయినట్లు ఇరాన్ విదేశాంగ కార్యాలయానికి ఒక లేటర్ వ్రాసి దాని కాపీని భారత విదేశాంగ కార్యాలయానికి పంపి చేతులు దులుపుకున్నాడు తన పని అయిపోయినట్లు అంతేకానీ ఇరాన్ అధికారులు మాధుర్ ని కిడ్నాప్ చేసినట్లు దానిని ఇరాన్ లోని రా అధికారులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు.రెండవ రోజు ఇక లాభం లేదనుకొని రా అధికారులు ఒక కొత్త వ్యూహంతో వెళ్ళారు. డిల్లీ లో ఉన్న తమ నమ్మకస్తుల ద్వారా అప్పటి ప్రతిపక్ష నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజపేయీ గారికి విషయం చెప్పి ఎలాగయినా ప్రధాని దృష్టికి ఈ విషయం తెలియచేయమని లేకపోతె మాధుర్ ని చంపేసినా చంపేస్తారు అంటూ విన్నవించారు. శ్రీ వాజపెయీ గారు ప్రధాని PV నరసింహా రావు గారికి పరిస్థితి తీవ్రత తెలపడంతో కిడ్నాప్ అయిన నాలుగో రోజు ఇరాన్ లోని ఎవిన్ [Evin] జైలు నుండి D.B. మాధుర్ గారిని విడుదల చేశారు సవాక్ అధికారులు. అయితే 48 గంటలలోగా దేశం విడిచి పొమ్మని ఆదేశాలు ఇచ్చారు.జైలు నుండి భారత రాయబార కార్యాలయానికి చేరుకున్న తరువాత మాధుర్ జైలులో జరిగిన విషయం చెప్పేశాడు , అదేమిటంటే జైలులో తనని ప్రశ్నించిన సవాక్ అధికారులు ఇరాన్ లో పనిచేస్తున్న రా అధికారుల పేర్లు వారి రాన్క్స్ అంటే హోదా వివరాలతో సహా చెప్పి అవి నిజమేనా అని హింసించారు అని చెప్పాడు. అంటే ఇరాన్ లో రా చీఫ్ తో సహా అందరి పేర్లు ఎలా తెలిసాయి సవాక్ కి ?
4.మొహమ్మద్ ఉమర్ ..ఇతను ఇరాన్ లో భారత రాయబారి ఇంటివద్ద అంటే హామీద్ అన్సారీ ఇంటి వద్ద సేక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఒక రోజు సవాక్ అధికారులు మొహమ్మద్ ఉమర్ ని కిడ్నాప్ చేసి మూడు గంటలపాటు ప్రశ్నలు వేసి తరువాత వదిలిపెట్టారు. కిడ్నాప్ అయినవెంటనే రా అధికారులు విషయాన్ని హమీద్ అన్సారీ కి చెపితే డబ్బుకి అమ్ముడుపోయి మొహమ్మద్ ఉమర్ ఇరాన్ కి మన సమాచారం అన్దిస్తున్నాడేమో విచారించండి అన్నాడట. అయితే తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది మొహమ్మద్ ఉమర్ మంచివాడు అని చెప్పారు రా అధికారులు. అంతే ! మరుసటి రోజే మొహమ్మద్ ఉమర్ ని భారత్ కి తిప్పి పంపేశాడు హమీద్. ఒక సెక్యూరిటి గార్డ్ విదేశాల్లో పనిచేయడానికి నియమిస్తే భారత్ లో కంటే ఎక్కువ జీత భత్యాలు లభిస్తాయి. మొహమ్మద్ ఉమర్ మళ్ళీ ఏ విదేశాల్లో నియమించకుండా రిపోర్ట్ వ్రాసాడు హమీద్ అన్సారీ.
5.P.K. వేణుగోపాల్ ఇరాన్ లో రా స్టేషన్ చీఫ్. తన విధుల్లో భాగంగా ఒక ఇరాన్ మహిళతో సైట్ సీయింగ్ చేస్తున్నాడు. హఠాత్తుగా సవాక్ అధికారులు దాడి చేసి తీసుకెళ్ళి చిత్ర హింసలు పెట్టి వదిలారు. ఈ విషయమయి హామీద్ అన్సారీ ఇరాన్ విదేశాంగ శాఖ అధికారులకి ఎలాంటి కంప్లైంట్ చేయలేదు సరి కదా భారత్ లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి ఒక లేఖ వ్రాస్తూ రా చీఫ్ వేణుగోపాల్ ప్రవర్తన సరిగా లేదని ఒక ఇరాన్ మహిళతో తిరుగుతున్నాడని భారత దేశపు పరువు తీస్తున్నాడని అతన్ని సర్వీస్ నుండి తీసేయాలని రికమెండ్ చేశాడు.నిజానికి P.K.వేణుగోపాల్ మీద హనీ ట్రాప్ [గూఢ చారుల మీద అందమయిన అమ్మాయిలని వల వేయడాన్ని హనీ ట్రాప్ అంటారు ]వల వేశారని తనకి తెలుసు కానీ ఎవరు తన మీద వల వేసారో తెలుసుకోవడానికే ఇరానీ మహిళతో సైట్ సీయింగ్ వెళ్ళాడు. కానీ భారత్ నుండి తిరిగి రమ్మని ఆదేశాలు అందుకున్నాడు వేణుగోపాల్. భారత్ రాగానే వేణుగోపాల్ ని సర్వీస్ నుండి తొలగించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటంటే ఏ మహిళతో తిరుగుతున్నాడు అని హమీద్ అన్సారీ భారత్ లోని విదేశాంగ కార్యాలయానికి లేఖ వ్రాసి సర్వీస్ నుండి తొలగించాడో అదే మహిళ భారత్ సందర్శన కోసం విసా కి దరఖాస్తు చేసుకుంది. వీసా అప్ల్లికేషన్ ఫార్మ్ లో చెప్పిన కారణం ఏమిటంటే మాజీ రా చీఫ్ ఆరోగ్యం బాగాలేదు అని , వేణుగోపాల్ ని చూడడానికి అని. ఇరాన్ లోని రా అధికారులు వద్దని చెప్పినా వినకుండా ఆ ఇరాన్ మహిళ కి వీసా మంజూరు చేశాడు హమీద్ అన్సారీ. అర్ధం కాకపోవడానికి మనం గూఢచారులం కానక్కరలేదు అనుకుంటా !
6.ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయం లో పనిచేసిన 1st సెక్రటరీ [ఇతను 10 సంవత్సరాలకి పోస్టింగ్ ఇచ్చారు ] వీసా కోసం వచ్చే ఇరాన్ విద్యార్ధుల దగ్గర ఒక్కొక్కరినుండి $500 వసూలు చేసి విసా ఇచ్చేవాడు. ఇలా వీసా కోసం వచ్చే విద్యార్ధులు తమకి భారత్ లోని వివిధ విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ ఖరారు చేసినట్లుగా అడ్మిషన్ లెటర్స్ జత పరిచేవారు. రా అధికారులకి అనుమానం వచ్చి భారత్ లోని విశ్వ విద్యాలయాలలో విచారణ చేయగా తాము ఇరాన్ విద్యార్ధులకి ఎవరికీ ఎలాంటి అడ్మిషన్ లెటర్స్ ఇవ్వలేదు అని తేల్చి చెప్పారు. అంటే అవి నకిలీ లెటర్స్ అన్నమాట.ఈ విషయమయి రిపోర్ట్ తయారుచేసి హమీద్ అన్సారీ కి ఫైల్ ఇచ్చారు రా అధికారులు. ఆ రిపోర్ట్ చెత్త బుట్టలో పడేశాడు హమీద్ అన్సారీ.
7.ఇరాన్ లోని పాకిస్తాన్ రాయబారి తో తరుచూ సమావేశమయ్యే వాడు హమీద్ అన్సారీ,అది కూడా మూడు నుండి నాలుగు గంటలపాటు పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోనే ఉండేవాడు. ఇలా సమావేశం అవ్వాలంటే ముందుగా Ministry of External Affairs of India[MEA] [భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ] నుండి అనుమతి ఉండాలి మరియు చర్చల వివరాలు తెలుపుతూ రిపోర్ట్ ఇవ్వాలి. అది కూడా అధికార సమావేశం అవ్వాలి. కానీ ఈ విషయమయి MEA కి ఎలాంటి సమాచారం ఇచ్చేవాడు కాదు హమీద్ అన్సారీ. ఇది దేశ ద్రోహ చర్య అవుతుంది. కానీ ఎవరు చెప్తారు ? అప్పటికీ భారత్ లోని రా చీఫ్ కి విషయం చెప్పినా అది ప్రధాని కార్యాలంలో మధ్య స్థాయి అధికారులు ప్రధాని దాకా వెళ్ళనివ్వలేదు.
8.హమీద్ అన్సారీ చేసిన మరో దేశ ద్రోహ చర్య ఏమిటంటే సౌదీ అరేబియా,దుబాయ్,బహ్రెయిన్ దేశాల్లోని భారత రాయబారులతో సమావేశం అయ్యి ఆయా దేశాల్లో రా కార్యకలాపాలని అడ్డుకోవాలని చెప్పేవాడు. దాంతో గల్ఫ్ లోని రా అధికారులు ఆత్మరక్షణలో పడిపోయారు. ఫలితంగా 93 ముంబై బాంబు పేలుళ్ళ గురుంచి ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయారు.
9.హమీద్ అన్సారీ ని ఇరాన్ నుండి బదిలీ చేసిన రోజు రాయబార కార్యాలయం లోని ఉద్యోగులు స్వీట్స్ పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు అంటే ఇతని మీద ఎంత వ్యతిరేకత ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
10. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే సవా లక్ష ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి ఆపై పోలీస్ ఎంక్వయిరీ చేసి అంతా సవ్యంగా ఉంటేనే ఉద్యోగం ఇస్తారు మరి భారత ఉప రాష్ట్రపతి లాంటి అత్యంత కీలకమయిన పదివిలో ఈ దేశ ద్రోహి ని ఎలా కూర్చోబెట్టారు ?
11. అన్సారీ కొడుకు ఇరాన్ కి చెందిన ఇద్దరు మహిళలని పెళ్లి చేసుకున్నాడు మరి ఈ విషయం ఒక ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా భారత ప్రభుత్వానికి తెలిపాడా ?
12. తనవైపు నుండి ఎవరూ తప్పు పట్టకుండా ఖాంగ్రేస్ చాల తెలివిగా కమ్యూనిస్ట్ అయిన సీతారాం ఏచూరి చేత హమీద్ అన్సారీని ఉపరాష్ట్రపతి పదవిలో పది సంవత్సరాలు ఉంచకలిగింది అంటే కేవలం వోటు బాంక్ రాజకీయం అనక ఇంకేమి అంటారు ?
13. తనకి రాష్ట్రపతి పదవి రాకపోయేసరికి ఒక్కసారిగా అసహనం అంటూ విషం కక్కాడు హమీద్ అన్సారీ. ఇతని విద్రోహ చర్యల కేంద్రం అలీఘర్ ముస్లిం యూనివెర్సిటీ లో చేసిన పనులు చెప్పాలంటే మరో నీచ గ్రంధం అవుతుంది.
14. N.K. సూద్ మాజీ రా అధికారి 2010 లో రిటైర్ అయ్యారు. ప్రధాని శ్రీ నరేంద్రమోడి గారికి ఇచ్చిన వినతిపత్రం లోని పై విషయాలు ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. తను బయటికి వెల్లడించిన విషయాలు కొన్ని మాత్రమె ,చెప్పకూడని విషయాలు కూడా ఆ వినతి పత్రంలో ఉన్నాయి.
Courtesy : Partha Saradhi