మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని నదియాద్ పట్టణంలో జరిగింది. అమ్మాయి కులంవాడినని చెప్పుకుని నమ్మించాడు. 5 లక్షలుకూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
నవంబర్ 2020లో యసర్ పఠాన్ అనే అబ్బాయి ఫేస్బుక్లో ఎస్సీ హిందూ పేరుతో నకిలీ ప్రొఫైల్ను తయారు చేసి నర్సింగ్ విద్యార్థిని అయిన 24 ఏళ్ల ఎస్సీ అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అబ్బాయి తన కులానికి సంబందించినవాడే కాబట్టి ఆమె రిక్వెస్ట్ అంగీకరించింది. ఇక ఇద్దరూ చాటింగ్ చేసుకోవడం, డేటింగ్ చేయడం ప్రారంభించారు. అబ్బాయి తనకు పోలాండ్లో పరిచయాలు ఉన్నాయని.. ఉన్నత చదువుల కోసం ఆమెను పోలాండ్కు పంపుతానని ఆమెకు భవిష్యత్తు గురించి అందమైన కలలను చూపించాడు.
అమ్మాయి కూడా చాల సంతోషించింది. ఒక రోజు అబ్బాయి ఆమెకు పోలాండ్లో అడ్మిషన్ ఏర్పాటు చేశానని చెప్పాడు. అతను పోలాండ్ లో తన స్నేహితుడి ద్వారా పొందిన పోలాండ్ వీసాను ఆమెకు ఇచ్చి.. ప్రయాణానికి, వీసా ఖర్చులకు రూ.5 లక్షలు ఏర్పాటు చేయమని కోరాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది అమ్మాయి. తల్లిదండ్రులు తమ నగలు అమ్మి ఆమె చదువుకు రూ.5 లక్షలు ఇచ్చారు.
విమానం దుబాయ్ మీదుగా వెళ్తుందని అబ్బాయి చెప్పాడు. ఆమె ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో దిగింది, అక్కడ ఆమె ప్రేమిస్తున్న వ్యక్తి హిందువు కాదని, ముస్లిం అబ్బాయి యాసర్ పఠాన్ అని నిజం తెలుసుకుంది. దుబాయ్లో ఆమెను కిడ్నాప్ చేశారు.
బాలికను దుబాయ్లో లైంగికంగా వేధించి వివిధ కస్టమర్లకు పంపించారు. పోలీసులకు ఏదైనా చెబితే చంపేస్తానని యాసర్ ఆమెను బెదిరించాడు. ఓ రోజు దుబాయ్ పోలీసులకు అన్నీ చెబుతానని బెదిరించింది ఆ అమ్మాయి. దీంతో ఆమెను నదియాడ్కు తీసుకువచ్చాడు. అక్కడ ఆమెను ఇంట్లో బంధించి సెక్స్ టాయ్గా ఉపయోగించారు. ఆ ఇంట్లోనే యాసర్ తండ్రి, సోదరుడు, స్నేహితులు ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. వారు కోరుకున్నప్పుడల్లా ఆమెపై అత్యాచారం చేసేవారు. యాసర్ తల్లి, సోదరి కూడా వారికి సహాయం చేసారు. వారు ఆమెను కాఫిర్ అని పిలుస్తూ.. ముస్లింగా మారమని, అలాగే కలిమా చదవమని కోరారు.
ఒక రోజు ఒక వ్యక్తి ఆమె అరుపులను విని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను 24 మార్చి 2022న రక్షించారు, అక్కడ ఆమె పోలీసులకు ప్రతిదీ వివరంగా చెప్పింది. యాసర్ పరారీలో ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులు జబీర్ఖాన్ పఠాన్ (నిందితుడి తండ్రి), ఫైజల్ఖాన్ పఠాన్ (నిందితుడి సోదరుడు), షెహనాజ్ ఖాన్ పఠాన్ (నిందితుడి తల్లి), సురైయాఖాన్ పఠాన్, ఫర్దీంఖాన్ సయ్యద్, ఫరీదాబాను మాలెక్, నదీమ్ మాలెక్లను అరెస్టు చేశారు. అమ్మాయిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అమ్మాయి దళితురాలే కానీ.. ఒంటరి కాదని దళిత నేత జిగ్నేష్ మేవానీ, దిలీప్ మండల్ తదితరులు గొంతెత్తారు.
సోషల్ మీడియా ఖాతాను ఆధార్ నంబర్తో లింక్ చేయడంపై ప్రభుత్వం ఆలోచించాలని.. హిందూ బాలికలను కాపాడాలని నెటిజన్లు కోరుతున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)