మంత్రి ఈటల ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. ఆయన దగ్గరున్న రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అటు ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమేనని విజిలెన్స్, రెవెన్యూ అధికారులు తేల్చారు. నివేదిక అందగానే ఈటెల
అటు తన శాఖను బదిలీ చేసినందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. పథకం ప్రకారమే తనను టార్గెట్ చేశారని…వాస్తవాలు త్వరలోనే తేలుతాయని అన్నారు. అనుచరులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈటలకు మద్దతుగా నిరసన తెలిపిన జమ్మికుంట టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది.