బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ కోసం రైళ్ళను నిలిపేయడంపై ప్రతిపక్ష పార్టీలు మండపడుతున్నాయి. నితీశ్ కుమార్ సమాధాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడం కోసం ఈ యాత్ర చేస్తున్నారు. ఆయన బుధవారం బక్సర్లోని పోలీస్ లైన్స్ నుంచి అతిథి గృహానికి వెళ్లారు. ఆయన రైల్వే క్రాసింగ్ను దాటి, నిరంతరాయంగా ప్రయాణించేందుకు వీలుగా, పాట్నా-బక్సర్ లోకల్ ట్రైన్, కామాఖ్య ఎక్స్ప్రెస్ వంటి రైళ్లను ఔటర్ సిగ్నల్ వద్ద నిలిపేశారు. దీంతో ప్రయాణికులు చాలా అసహనానికి గురయ్యారు. ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని రైల్వేను కోరారు బీజేపీ నేతలు.
https://twitter.com/IndiaToday/status/1615948022525091840?s=20&t=DjFshE1bO34F8KgRZP5Hcw