అదితి జైన్ – “ఈ పరిణామాలు అన్ని నేను చూసాను మరియు ఇప్పటికీ చూస్తున్నా. అందుకే నేను వీటి గురించి పూర్తిగా చెప్పగలను.
బెంగాల్ పశ్చిమ బోర్డర్ ప్రదేశంలో చిన్న కంపెనీ యాజమాన్యంలోని టౌన్షిప్ అయిన కుమార్ధుబి లో నేను పెరిగాను. ఇక్కడ నుండి కలకత్తా వరకు ఒక రహదారి ప్రయాణం మిమ్మల్ని అప్పటి వరకు నిరాటంకంగా నడుస్తున్న భారీ పారిశ్రామిక ఎస్టేట్ గుండా తీసుకువెళ్ళేది.
కుమారధుబీ స్వయంగా కొన్ని ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీలకు ఆతిథ్యం ఇచ్చింది. “మెక్నల్లీ భారత్” అప్పట్లో భారతదేశంలోనే అతిపెద్ద మరియు అత్యంత ప్రత్యేకమైన ఫౌండ్రీ మరియు దాని రంగంలో అదే అగ్రగామిగా ఉన్న ఫైర్-బ్రిక్ ప్లాంట్. మా నాన్న ఇది ప్రారంభించిన మొదటి సం. ల నుండి దీని నిర్మాణంలో ఉన్నారు. భారతదేశ రాజధాని ఢిల్లీని దాని పారిశ్రామిక పవర్ హౌస్ కలకత్తాకు అనుసంధానించే పురాతన జాతీయ రహదారి కుల్తీ మరియు అసన్సోల్ పట్టణాల గుండా సాగింది. ఈ రోడ్డుపై ఇండియన్ ఐరన్, బ్రిటిష్ ఆక్సిజన్, కేర్వ్స్ జిన్, చిత్తరంజన్ లోకోమోటివ్స్, బెంగాల్ కోల్, పిల్కింగ్టన్ గ్లాస్ వంటి పెద్ద తయారీ సంస్థలతో మార్టిన్ బర్న్, సెన్ రాలీ సైకిల్స్ తో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వందలాది చిన్న అనుబంధ యూనిట్లు ఉండేవి.
మీరు తూర్పు వైపునకు వెళ్లినప్పుడు, గతంలో ప్రైవేట్ యాజమాన్యం నిర్వహణలో అంటే బర్డ్ & కంపెనీ, థాపర్స్ మరియు టాటాస్ వంటి పాత దిగ్గజాలు నిర్వహించిన భారీ కొలీరీల(బొగ్గు ఉత్పత్తి కి సంబంధించిన పరిశ్రమలు)తో రాణిగంజ్ పట్టణాలను దాటతారు. దుర్గాపూర్ నుండి వెళ్లే దారిలో భారీ ఉక్కు కర్మాగారం, ఎరువుల కర్మాగారం మరియు డజన్ల కొద్దీ చిన్న ఇంజనీరింగ్ మరియు రసాయన కర్మాగారాలు కనిపించేవి.
ప్రయాణం అప్పటి జిల్లా కేంద్రమైన బుర్ద్వాన్ మీదుగా కొనసాగితే మీరు చివరికి కలకత్తా శివార్లలోని ఉత్తరపరా చేరుకుంటారు. హిందుస్థాన్ మోటార్స్తో సహా వందలాది కర్మాగారాలతో ఇది ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం.
చారిత్రాత్మకంగా కలకత్తా కిడ్డర్పోర్ డాక్స్ మరియు నౌకాయాన నది వంటి లోతైన నీటి నౌకాశ్రయాలతో కూడిన సామ్రాజ్య నగరం. ఇది హాంకాంగ్ మరియు సింగపూర్ కంటే అనేక రెట్లు పరిమాణంలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి పారిశ్రామిక మరియు వ్యాపార రాజధాని.
ఆసియాలోని అతిపెద్ద కంపెనీలు మరియు బ్యాంకులు ఇక్కడ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, స్టాండర్డ్ మరియు చార్టర్డ్ బ్యాంకుల విలీనానికి ముందే చార్టర్డ్ బ్యాంక్ భవనం ఇక్కడ ఉంది. లియోన్స్ రేంజ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు ప్రముఖ బీమా కంపెనీల కార్యాలయాలను నిర్వహించింది. వాస్తవానికి, డల్హౌసీ మరియు ఫెయిర్లీ ప్లేస్ మొత్తం ప్రాంతం మార్టిన్ బర్న్, ఆండ్రూ యూల్, బర్డ్ & కంపెనీ, గార్డెన్ రీచ్, జెస్సోప్స్, మర్ఫీ రేడియో వంటి పేర్లతో భారతీయ వ్యాపార ప్రముఖులను కలిగి ఉండేది. ఓడ నిర్మాణం నుండి మైనింగ్ వరకు స్పెక్ట్రమ్లోని అనేక వ్యాపారాలను కలిగి ఉండేది.
కలకత్తా అత్యంత వైవిధ్యభరితమైన జనాభా కలిగిన ఒక నిజమైన ప్రపంచ నగరం. దీనిని ఇరాకీ యూదులు, అర్మేనియన్లు, పర్షియన్లు, చైనీస్ మరియు ఇతరులు తమ నివాసంగా ఎంచుకున్నారు. వాణిజ్య అవకాశాలు గణనీయంగా ఉన్నాయి మరియు నైపుణ్య అవసరాలు కూడా ఉన్నాయి. కలకత్తాలో డబ్బు సంపాదించే అవకాశం మెండుగా ఉండేది.
బెంగాల్లోని పరిశ్రమలు ఈశాన్య దిశగా డార్జిలింగ్ మరియు జల్పాయిగురి వైపు తేయాకు తోటలకు కూడా విస్తరించాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర టీ ఉత్పత్తుల కంటే వేలం ధరలతో ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ఆకులను ఉత్పత్తి చేశాయి.
” కానీ ఏమిటంటే, ఇవన్నీ ఆ తర్వాత నాశనం కావడం విషాదం కాదు; అసలైన విషాదం ఏమిటంటే వీటిని ఎప్పటికీ పునర్నిర్మించలేము.”
1970ల నుండి కలకత్తా మరియు బెంగాల్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తికి అదే జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాలు, ముఖ్యంగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు నాయకత్వంలో పరిశ్రమలపై విరుచుకుపడి యూనియన్లకు అధికారం కల్పించారు. ఫ్యాక్టరీ తర్వాత ఫ్యాక్టరీ శాశ్వతంగా మూసివేయడం ప్రారంభమైంది.
కమ్యూనిస్టు పార్టీ యూనియన్ల ఎర్రజెండాలు రాష్ట్రమంతటా రెపరెపలాడాయి, వ్యాపారాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు మూతపడిన దుకాణాలు, కొన్ని జాతీయం చేయబడ్డాయి. తెలివైన వారు త్వరగా తమ కార్యాలయాలు, పరిశ్రమలను ఇతర ప్రదేశాలకు మార్చారు. ఈ రోజు కలకత్తాలో వర్జీనియా హౌస్లో తన ప్రధాన కార్యాలయాన్ని కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమైన సంస్థ ITC మాత్రమే. అయితే దీని కార్యకలాపాలు చాలా వరకు ఇప్పుడు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఇతర దిగ్గజాలు ఏవీ ఇక్కడ ఉనికిలో లేవు, అవి ఏవైనా ఉన్నట్లయితే అవి వాటి అసలు పరిమాణంలో ఒక చిన్న భాగం మాత్రమే.

లండన్లోని యూనివర్సిటీ కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయిన మిస్టర్ జ్యోతిబసు బ్రిటన్ మిడిల్ టెంపుల్ బార్ అసోసియేషన్ లో నమోదు అయ్యారు. అతను తన విద్యార్థి రోజులలో ఒక కార్యకర్త, అతని మొత్తం రాజకీయ జీవితంలో కార్మిక సంఘాలచే మద్దతు పొంది అలాగే వున్నాడు. వారు అతనిపై ఆధారపడినట్లే అతను వారిపై ఆధారపడి ఉన్నాడు. పర్యవసానంగా, సమ్మెలు మరియు అశాంతి రోజూ వారీ కార్యక్రమంలా మారింది, కంపెనీలు నష్టపోవటం ప్రారంభించాయి. చాలా మంది వ్యాపారవేత్తలు చైవ వరకు వేలాడడానికి ప్రయత్నించారు, కానీ చివరికి విరమించుకున్నారు. బెంగాల్లో పనిచేయడం భరించలేనిధిగా మారింది. లా అండ్ ఆర్డర్ అరాచకంతో భర్తీ చేయబడింది. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క గూండాలు మామూలుగా వ్యాపార నిర్వాహకులు మరియు యజమానులను వేధించేవారు. కమ్యూనిస్టుల దౌర్జన్యం వల్ల వ్యాపార సంస్థలు మూసేయడం లేదా పారిపోవడంతో లక్షలాది మంది కార్మికులు తొలగించబడ్డారు. బెంగాల్ అప్పటివరకు ఉన్న తన ఆధిపత్యాన్ని కోల్పోలేదు, ప్రతి ఒక్కటి కోల్పోయింది.
డన్లప్స్, గెస్ట్ కీన్ విలియమ్స్, బ్రైత్వైట్, బర్న్ & కంపెనీ (దీని తర్వాత బర్న్పూర్ పట్టణం దాని పేరును కలిగి ఉంది) మరియు మెటల్ బాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు జాతీయం చేయబడ్డాయి లేదా ఉనికిలో లేవు. బిర్లాలు మరియు సింఘానియాలు వంటి భారతీయ వ్యాపార కుటుంబాలు కర్మాగారాలను మూసివేసి బొంబాయి మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు మారాయి. ఇవి ఆర్థిక నాశనానికి దారితీశాయి. దీంతో పెద్దఎత్తున నిరుద్యోగం ఏర్పడింది.
కార్మిక వివాదాలలో వ్యాపార నిర్వాహకులు యూనియన్ గూండాలచే కొట్టబడినప్పుడు పోలీసులను జోక్యం చేసుకోకుండా నిరోధించి వ్యాపార నిర్వాహకులను సమిధలను చేసి అగ్నికి ఆజ్యం పోసింది.
1984లో, దుర్గాపూర్లోని ఒక ప్రాజెక్ట్ సైట్కు బాధ్యత వహించిన యువ ప్రాజెక్ట్ ఇంజనీర్గా, హిందుస్థాన్ ఎరువుల కోసం మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను నిర్మించడానికి నా యజమాని ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, నన్ను మధ్యాహ్నం ఎండలో నాలుగు గంటల పాటు చమురు పీపాపై నిలబడేలా చేశారు. కార్మిక సంఘాలు బెదిరింపు నినాదాలు చేశారు. విచిత్రం ఏమిటంటే, నేను ఏమి తప్పు చేసాను లేదా వారి డిమాండ్లు ఏమిటో నాకు ఎటువంటి క్లూ లేదు. ఆ కాలంలో సమ్మెలు మరియు హింస మామూలుగా పనికి వెళ్లినంత సాధారణంగా జరిగేవి.
విషాదకరంగా, ఈ పరిణామాల వల్ల పరిశ్రమ మరియు సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న బెంగాల్, తెలివిగల వ్యాపారవేత్తలెవరూ దానితో సంబంధం కలిగి ఉండకూడదనుకునే వెనుకబడిన స్థితికి దిగజారింది. బెంగాల్ లో యూనియన్లు పెట్టుబడిదారులను ఎప్పటికీ తిరిగి రాకుండా పారిపోయేటట్లుగా పంపించాయి. కమ్యూనిస్ట్ పార్టీ మరియు దాని నాయకత్వం ఈ విధిని నిర్దేశించాయి. కలకత్తాలోని గొప్ప కంపెనీలు వ్యాపారాలన్ని శాశ్వతంగా మూసివేశాయి.
తదనంతరం, రివర్స్ మైగ్రేషన్ జరగడం ప్రారంభమైంది మరియు విద్యావంతులైన బెంగాలీలు మంచి అవకాశాల కోసం తమ ఇళ్లను విడిచిపెట్టారు. విచారకరంగా, ఆరు దశాబ్దాల క్రితం – అన్ని రహదారులు కలకత్తాకు దారితీశాయి; ఇప్పుడు అన్ని రహదారులు బెంగాల్ నుండి బయటకు పోడానికి దారి చూపిస్తున్నాయి. అసన్సోల్, రాణిగంజ్ మరియు దుర్గాపూర్లో ఉన్న కుమార్ధుబి గొప్ప పారిశ్రామిక కేంద్రం ఇప్పుడు తుప్పు పట్టింది. కలకత్తాలో ఒకప్పుడు అత్యుత్తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే కర్మాగారాలు రిటైల్ షోరూమ్ల ద్వారా భర్తీ చేయబడ్డాయి.
డమ్ దమ్ విమానాశ్రయం, ఒకప్పుడు చాలా యూరోపియన్ మరియు ఆసియా నగరాలకు ప్రత్యక్ష లింక్లతో, భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండేది. దాని పూర్వపు వైభవానికి ఇప్పుడు నీడగా ఉంది. చాలా గ్లోబల్ ఎయిర్లైన్స్ వైదొలిగాయి. చౌరింగ్గీ మరియు పార్క్ స్ట్రీట్తో పాటు అత్యుత్తమ క్రిస్మస్ అలంకరణలను కలిగి ఉన్న ప్రపంచ స్థాయి మహానగరం నుండి, కలకత్తా అధిక రద్దీగల దౌర్భాగ్య నగరంగా మారింది.
బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి అయినప్పుడు కమ్యూనిస్టులు తమ మూర్ఖత్వాన్ని గ్రహించారు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. నందిగ్రామ్లోని రసాయనాల తయారీ కేంద్రంతో ప్రారంభించి బెంగాల్ను పునరుద్ధరించాలని భట్టాచార్య చేసిన ప్రణాళికలు రాజకీయ వివాదంలో పడ్డాయి. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన ఏదైనా అర్థవంతమైన పునరుద్ధరణపై సింగూర్లో విఫలమైన టాటా మోటార్స్ ప్లాంట్ ఘటన శాశ్వతంగా తలుపులు మూసింది.

పెట్టుబడిదారీ వ్యతిరేక చేష్టలుతో నిండి ఈ నూతన ప్రాజెక్టుల పతనానికి కారణం అయిన తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మమతా బెనర్జీ తదనంతరం భట్టాచార్య ముఖ్యమంత్రి స్థానాన్ని భర్తీ చేశారు. ఆమె తన రాజకీయ చట్టబద్ధతను సాధించడానికి కారణం అయిన ఇంట్రెస్ట్ గ్రూప్ లు ప్రతినిధిగా గత నెలలో, ఆమె వరుసగా మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
కలకత్తా, ఒకప్పుడు నిర్మింపబడ్డ ఒక సామ్రాజ్యం ఇప్పుడు మరొక రాలిన నక్షత్రంగా మారింది. కనీసం నా జీవిత కాలంలో అయినా దాని పూర్వ వైభవాన్ని తిరిగి పొందే విశ్వసనీయమైన అవకాశం దీనికి లేదు. ఒకప్పటి ఆ నగరాన్ని గుర్తుంచుకునే నాకు మరియు ఆ భారతీయుల తరానికి అది ఒక భయంకరమైన విషాదం. సంపద మరియు దానిని సృష్టించే వారి పట్ల అగౌరవం, దాని యొక్క పరిణామాల వల్ల జరిగే పతనం మొదలగు వాటికి నిజానికి బెంగాల్ ఒక స్పష్టమైన ఉదాహరణ.

రాజకీయ నాయకులకు ఇది ఒక ముఖ్యమైన పాఠం. ప్రభుత్వాలు వ్యాపారానికి అడ్డంకులు సృష్టించినప్పుడు, అది వారి పెరుగుదల మరియు ఉత్పాదకతను బలహీనపరుస్తుంది. రాజకీయనాయకులు వారితో చెడుగా ప్రవర్తించినప్పుడు, అది పెట్టుబడి మరియూ ఆర్థిక కార్యకలాపాల విరమణకు దారితీస్తుంది. అది నిరుద్యోగం మరియు అశాంతికి అనివార్యంగా దారి తీస్తుంది.
క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ గత 40 ఏళ్ల బెంగాల్ చరిత్ర. విచిత్రమేమిటంటే, చాలా మంది పాలసీలు రచించేవారికి ఇప్పటికీ దాన్ని అర్ధం చేసుకోలేకపోవడం.”
Courtesy : చాడా శాస్త్రి