హిమాచల్ ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఢిల్లీలోని ఆయన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. ఇక ఆయన భార్య ప్రస్తుతం చార్థామ్ యాత్రలో ఉండగా.. శర్మకు చెందిన వ్యక్తిగత సిబ్బంది ఆఫీసర్ మండిలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఎంపీ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఎంపీ రామ్ స్వరూప్ శర్మ హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 సంవత్సరంలో ఆయన తొలిసారిగా పార్లమెంట్కు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు.