రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజీయాసర్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడటంతో.. వెంటనే అందులోమంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఐదుగురు జవాన్లు బయటపడగా.. మరో ముగ్గురు జవాన్లు వాహనంలోనే చిక్కుకుపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.