మణిపూర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. స్టడీ టూర్ కోసం ఇంఫాల్ నుంచి బస్సు బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే… పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఘోర ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. చనిపోయిన వారంతా అమ్మాయిలే.
https://twitter.com/NBirenSingh/status/1605487841252765697?s=20&t=_TvtzvSEJoSKmoXlyIZdIA