కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో విషాదం నెలకొంది. 24 గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందారు. నిన్న సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గోదాం గడ్డ వద్ద బొల్లంపల్లి శ్యాంసుందర్ పురుగుల మందుతాగి ఆత్యహత్య చేసుకున్నాడు. ఏడు నెలల క్రితం భార్య ఉరేసుకుని చనిపోయిన స్థలంలోనే తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య మరణించిననాటి నుంచి శ్యాం సుందర్ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే శ్యాంసుందర్ దహన కార్యక్రమం ముగించుకుని ఇంటికి చేరిన వెంటనే అతని తల్లి కనకలక్ష్మి చాతీలో నొప్పని అక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు.