విషాదం.. కరోనా కాటుకు బీజేపీ ఎంపీ మృతి.
https://twitter.com/ANI/status/1366597323300593664
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే.. రాజకీయ నేతల వరకు అందర్నీ బలిగొంది. మన దేశంలో కూడా ఇప్పటికే కరోనా మహమ్మారి బారినపడి అనేక మంది రాజకీయ నేతలు మృతిచెందారు. తాజాగా బీజేపీ ఎంపీ నంద్కుమార్ చౌహాన్ కూడా మంగళవారం ఉదయం కరోనాతో పోరాడి ఓడిపోయారు. గత కొద్ది రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురవ్వగా.. వైద్యులు కరోనా పరీక్షలు జరిపారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అనంతరం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ.. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో.. వెంటిలేటర్ అమర్చారు. గత కొద్దిరోజులుగా ఆయన్ను వెంటిలెటర్పైనే ఉంచి చికిత్స అందిస్తుండగా.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
https://twitter.com/narendramodi/status/1366604814721839114
కాగా, చౌహాన్ గతంలో పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం మధ్యప్రదేశ్లోని నిమార్ ప్రాంతంలోని బుర్హాన్పూర్. 1952 సెప్టెంబర్ 8వ తేదీన ఆయన జన్మించారు. నందకుమార్ చౌహాన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్టర్ ద్వారం సంతాపం తెలియజేశారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఎంపీ నంద్కుమార్ మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ.. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.
https://twitter.com/ChouhanShivraj/status/1366596388629356545