ఈ ఎన్నికల్లో నోయిడా సెంటిమెంట్ నూ బ్రేక్ చేశారు యోగీ. యూపీ సీఎం సీట్లో ఉన్న ఎవరైనా సరే నోయిడాలో అడుగుపెట్టారంటే అంతే …అధికారం పోగొట్టుకోవాల్సిందే అనే సెంటిమెంట్ ఉంది.
1988లో నాటి సీఎం వీరబహదూర్ సింగ్ నోయిడా పర్యటకు వెళ్లివచ్చిన కొన్నిరోజులకే పదవీచ్యుతలయ్యారు. నాటి నుంచి అధికార పర్యటన అంటేనే సీఎంలు జంకుతారు. అక్కడ జరిగే ఏ కార్యక్రమాలకూ వెళ్లరు. అయితే 2013లో నోయిడా వేదిగ్గా జరిగిన ‘ఏషియన్ డెవల్పమెంట్ బ్యాంక్’ (ఏడీబీ) సదస్సుకు హాజరయ్యారు. తరువాతి ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. అంతకుముందు 2007లో కూడా మాయావతి సీఎంగా ఉండగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తరువాతి ఎన్నికల్లో ఆమె కూడా దిగిపోవాల్సి వచ్చింది. కానీ 2017లో యూపీ సీఎం అయిన దగ్గర్నుంచీ నోయిడాలో అనేక మార్లు పర్యటించారు యోగీ. సన్నిహితులు, అధికారులు చెప్పినా ఆయన వినలేదు. నోయిడా ప్రాంత ప్రజల్ని నేరుగా కలుస్తానని..అక్కడి సమస్యలు తెలుసుకుంటానంటూ వెళ్లేవారు. తాజా ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ తలపడిన ఎస్పీ చీఫ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా నోయిడా వెళ్లలేదు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)