కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆర్థికసర్వేను లోక్ సభలో సమర్పించారు. దేశ ఆర్థికవ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఈ సర్వే ఆధారంగానే ఏటా బడ్జెట్ రూపొందిస్తారు. ఆసారి బడ్జెట్ జనాకర్షకంగా ఉంటుందని భావిస్తున్నారు. దేశ వృద్ధి రేటు 8 నుంచి 8.8.5 శాతంగా ఉండొచ్చన్న ఆర్థిక శాఖ అంచనాల నేపథ్యంలో మంత్రి సర్వేను ప్రవేశపెట్టారు. అటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. దేశం సాధించిన, సాధించబోయే ప్రగతిని వివరించారు. తరువాత మంత్రి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.