టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ కు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసినా కూడా కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో దాఖలు చేసిన Contempt of Court పిటిషన్ పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇద్దరు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 25 కు వాయిదా వేసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)