
.
1)కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామిజీ” ఈ రోజున మా వంటి సన్యాసులు నిర్భయంగా రాజ విధులలో తిరుగుతున్నాము అంటే అది శివాజీ మహారాజు పెట్టిన
భిక్ష ”అని అన్నారు.
2) ఔరంగజేబు”నేను ప్రాచీన సార్వభౌముల నందరిని నాశనం చేస్తుంటే శివాజీ స్వయంగా కొత్త సార్వభౌమత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రతిభాశాలి. నా సైన్యాలు 19 సంవత్సరాల పాటు అతడిని వెంటాడుతూనే ఉన్నా అతని రాజ్యం పెరుగుతూనే ఉన్నదిఅని ”వాపోయాడు
3)వియత్నాం కి చెందిన రక్షణ శాఖ మంత్రి మేడంబిన్1977 సంవత్సరంలో ఢిల్లీ వచ్చారు ఢిల్లీలో ఎక్కడైనా శివాజీ విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పూలమాల వేయాలని మన పాలకులను ఆమె అడిగారు. ఢిల్లీ అధికారులు హడావిడిగా తిరిగి శివాజీ విగ్రహాన్ని గుర్తించి ఆమెను తీసుకెళ్లారు ఆమె శివాజీ విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడుతూ” మా పోరాటానికి స్ఫూర్తి చత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఒక ప్రక్క యుద్ధ వ్యూహాలు పటిష్టంగా రచించు కుంటూ రెండో ప్రక్క తన సైన్యంలో జాతీయ భావాన్ని నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు చేశారు ఈ వ్యూహాన్ని మేము కూడా అనుసరించం దాంతో శక్తివంతమైన అమెరికా దేశాన్ని ఓడించి మా స్వాతంత్రాన్ని మేము కాపాడుకుందాం అందుకే శివాజీ మహారాజ్ మాకు ప్రేరణ అని” చెప్పింది.
శివాజీ కాలంనాటి పరిస్థితులు
శివాజీ జన్మించే నాటికీ దక్కన్ లో ఉన్న శక్తి వంత మైనబ హుమనీ రాజ్యం మూడు ముక్కలైంది. అహ్మద్ నగరంలో నిజాం షాహీ, గోల్కొండలో కుతుబ్ షాహీ, బీజాపూర్ లోఆదిల్షాహి రాజ్యాలు ఉండేవి. శివాజీ తండ్రి అహ్మద్ నగర్ నవాబు దగ్గర జాగీర్దార్ గా , సైన్యాధిపతిగా ఉండేవాడు. ఢిల్లీలోని మొగలాయిల విశృంఖలత్వం హిందువుల మీద హిందూ ధర్మం మీద దాడి చేస్తుండేవారు దేశమంతటా హిందువుల పరిస్థితి కడు దయనీయంగా ఉండేది ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకుని వచ్చి అందరిలో ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేసిన వారు శివాజీ. ఆ కాలంలో ఒక ప్రక్క శివాజీ ,ఇంకొక ప్రక్క గురుగోవింద్ సింగ్ ,మరోప్రక్క ఛత్రసాల్ పోరాటం చేసారు ఒక వేళా ఈ ముగ్గురు కలిసి పోరాటం చేసిఉంటే భారత దేశ చరిత్ర మరోరకంగా ఉండేది
శివాజీ ఎటువంటి వాడు
పరాభవానికి లోనైన మనస్సు విజిగీషీ ప్రవృత్తిగల మనస్సు రెండిటి మధ్య అంతరం ఉంది, విజిగీషీ ప్రవ్రుత్తి ప్రతికూలతలను లెక్కపెట్టదు. శివాజీ అన్ని రకాల పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగినట్టుగా వ్యవరించేవాడు. కూట నీతికి కూట నీటితోనే సమాధానం చెప్పేవాడు అందుకే శత్రువుతో ఏ సమయంలో ఎక్కడ తలపడాలో వ్యూహం రచించుకొని దెబ్బకొట్టేవాడు. శివాజీ తన సైన్యం ముందు హైందవిస్వరాజ్యం లక్ష్యంగా పెట్టేవాడు , తన సేనలు ఆత్మవిశ్వాసం తో ఉండటం అత్యంత ఆవశ్యకము అయినది దాన్ని గుర్తించిన శివాజీ తగిన వ్యూహాలు అమలు చేసేవారు. తనపై దాడికి వచ్చిన జై సింగ్ కు శివాజీ వ్రాసిన ఉత్తరం సంచలనమైంది దానిలో” మీరు ఒకవేళ హైందవ ధర్మాన్ని రక్షించేందుకు పోరాటం చేసేందుకు సిద్ధమైతే నేను మీ పల్లకి మోసే బోయనవుతాఅని ”వ్రాసాడు. అది శివాజీ నీతి.శివాజీ యుద్ధనీతి కారణం గ ఢిల్లీ లోని మొగల్ సామ్రాజ్యం బలహీనమైంది. దేశం నిలద్రొక్కుకొనే వ్యవధి లేకుండా ఆంగ్లేయలు భారత్ లో ప్రవేశించారు దానితో మరో 190 సంవత్సరాలు పోరాటం కోన సాగించవలసి వచ్చింది, శివాజీ కూడా ఆంగ్లేయులతో నావికా యుధాలు చేసాడు దానికోసం నావికా సైన్యం తయారు చేసాడు. శివాజీకి అడుగడుగునా ప్రేరణ శివాజీ తల్లి జిజియామాత ,గురువు సమర్ధరామస్వామి వారు .
ఔరంగజేబు కు చివరకు మిగిలింది ఏమిటి ?
శివాజీ ని బ్రతికి ఉండగా ఔరంగజేబు జయించలేకపోయాడు. శివాజీ ,శివాజికొడుకు శంభాజీ ఇద్దరు పరమపదించారు ,ఆ తరువాత దక్షిణా పథాన్ని పూర్తి గా స్వాధీనం చేసుకోవాలని ఔరంగజేబుయుద్ధనికి వచ్చాడు 25 సంవత్సరాలు ఇటే ఉన్నాడు శివాజీ పరమపదించిన తర్వాత కూడా హైందవి స్వరాజ్ లక్ష్యంగాశివాజీసైన్యం పోరాటం చేస్తూనే ఉన్నది ఆ పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమైన ది ఔరంగజేబు ను మహారాష్ట్ర లోపలి కూడా రానివ్వలేదు ఆ సమయంలో జరిగిన గెరిల్లాపోరాటం తో దెబ్బతిని ఔరంగజేబు వెన్నుచూపిపారిపోవాలని చూసాడు కానీ అంత సులభం కాలేదు చివరకు దారిలోనే చనిపోయాడు , అతని శవం కూడాఅగ్ర వరకు కూడా తీసుకుపోలేకపోయారు దారిలోనే సమాధి చేయవలసి వచ్చింది. కానీ చివరకుఔరంగజేబుకు మిగిలిందేమిటి తన సైన్యం పీనుగుల పెంట గా, తన రాజ్యం బంజరుగామిగిలింది , నాలుగు సంవత్సరాల పాటు ప్లేగు వ్యాధి తో లక్షమందికి పైగా సైనికులు చనిపోయారు.
ముగింపు వాక్యాలు
శివాజీ సామ్రాజ్యంలో ఎక్కడ మతకలహాలు జరగలేదు, మహిళలు అవమానించబడలేదు, మసీదులు ,మతగ్రంధాలు అవమానించబడలేదు. శివాజీ సామ్రాజ్యంలో శిక్షలు కూడా కఠినంగా ఉండేవి . శివాజీ మరి ఎక్కువకాలం ఫలించలేదు కానీ ఆ పరిపాలన ఇప్పటి అనుసరణీయం. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు దిశా నిర్దేశము శివాజీ జీవితమే