కార్గిల్ విజయ దివస్ 23వ వార్షికోత్సవాన్ని భారతదేశం ఇవాళ జరుపుకుంటోంది.1999లో పాకిస్థాన్పై భారత సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ దేశం ఈరోజును ‘కార్గిల్ విజయ దివస్’ గా జరుపుకుంటోంది. జూలై 26 అనేది మన సైనికుల సంకల్పం, సాహసోపేతమైన నాయకత్వానికి చిహ్నంగా గుర్తుండిపోయింది. ఈరోజే పాకిస్తానీ చొరబాటుదారులచే స్వాధీనం చేసుకున్న పర్వత శిఖరాలను భారత సైనికులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
1999, జులై 26న ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర నేతలు నివాళులు తెలిపారు.
“కార్గిల్ విజయ దివస్ భారతమాతకు గర్వకారణం, భారత కీర్తికి చిహ్నం. ఈ సందర్భంగా మాతృభూమి రక్షణలో తమ పరాక్రమాన్ని చూపించిన వీర పుత్రులందరికీ నా వందనం. జై హింద్!” అని ప్రధాని ట్వీట్ చేశారు.
कारगिल विजय दिवस मां भारती की आन-बान और शान का प्रतीक है। इस अवसर पर मातृभूमि की रक्षा में पराक्रम की पराकाष्ठा करने वाले देश के सभी साहसी सपूतों को मेरा शत-शत नमन। जय हिंद! pic.twitter.com/wIHyTrNPMU
— Narendra Modi (@narendramodi) July 26, 2022
కార్గిల్ విజయ దివస్ మన సాయుధ బలగాల అసాధారణ పరాక్రమానికి, సంకల్పానికి ప్రతీక. భారతమాతను రక్షించేందుకు ప్రాణాలర్పించిన వీర సైనికులందరికీ నేను నమస్కరిస్తున్నా. దేశప్రజలందరూ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటారు. జై హింద్!.” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.
कारगिल विजय दिवस हमारे सशस्त्र बलों की असाधारण वीरता, पराक्रम और दृढ़ संकल्प का प्रतीक है। भारत माता की रक्षा के लिए अपने प्राण न्योछावर करने वाले सभी वीर सैनिकों को मैं नमन करती हूं। सभी देशवासी, उनके और उनके परिवारजनों के प्रति सदैव ऋणी रहेंगे। जय हिन्द!
— President of India (@rashtrapatibhvn) July 26, 2022
నేడు కార్గిల్ విజయ దివస్ సందర్బంగా 1999లో మన దేశాన్ని రక్షించడంలో అచంచలమైన దేశభక్తి, అసమానమైన శౌర్యాన్ని ప్రదర్శించిన మన వీర సైనికులకు నా వినయపూర్వకమైన నివాళులు. వారి అత్యున్నత త్యాగానికి దేశం కార్గిల్ అమరవీరులకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది” అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయిడు ట్వీట్ చేశారు.
On Kargil Vijay Diwas, I pay my humble tributes to our valiant soldiers who displayed unwavering patriotism and unmatched gallantry in protecting our nation in 1999. The nation is ever indebted to the martyrs of Kargil for their supreme sacrifice.
— Vice-President of India (@VPIndia) July 26, 2022
కార్గిల్ విజయ దివస్ సందర్భంగా సాయుధ బలగాల ధైర్యానికి, త్యాగాలకు భారత్ సెల్యూట్ చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మా మాతృభూమిని రక్షించుకోవడానికి వారు చాలా కఠినమైన పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడారని ఆయన ట్వీట్ చేశారు.
On Kargil Vijay Diwas, India salutes the bravery, courage and sacrifice of our armed forces. They fought valiantly in extremely harsh conditions to defend our motherland. Their act of valour & indomitable spirit will remain etched forever as a defining moment in India’s history. pic.twitter.com/XSE24gM20r
— Rajnath Singh (@rajnathsingh) July 26, 2022