నిత్యావసర వస్తువుల లభ్యత, ధరలు, మద్దత్తు ధరలు..
ధరలు భయంకరంగా పెరిగిపోయాయి అందరూ పోస్ట్స్ పెడుతున్నారు. నిజమే నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉండవు. ఎందుకంటే ఏ సం. కి ఆ సం. ఆహారధ్యాన్యాలకు మద్దత్తు ధరలు పెంచుకుంటూ పోతున్నపుడు, రవాణా, విద్యుత్, కూలి చార్జీలు, షాప్ అద్దెలు వగైరా పెరుగుతున్నప్పుడు రిటైల్ లో కూడా ధరలు పెరగక తప్పదు. కానీ ఆ పెరుగుదల మద్దత్తు ధరల పెరుగుదల లాగే ఉందా లేదా ఆది దాటి ఇంకా ఎక్కువగా పెరిగాయా అన్నది బేరీజు వేసుకుంటేనే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది.
అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన కరోనా గానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం గానీ లేవు. అందుకే ఒక్కసారి ఇప్పుడు మనం 2014 లో ఉండే మద్దత్తు ధరలు, అప్పుడు రిటైల్ ధరలు మరియు ఇప్పుడు ఉన్న మద్దత్తు ధరలు ఇప్పుడు ఉన్న రిటైల్ ధరలు ఒకసారి పోల్చి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అదుపులో ఉంచడంలో ఏ ప్రభుత్వం బాగా పని చేసిందో తెలుస్తుంది.
క్రింద ఇచ్చిన లిస్ట్ లు చూడండి.
ఒకటి అప్పట్లో అంటే 2014 మే నెలలో అంటే మోడీ అధికారం కి వచ్చిన నెలలో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర వస్తువుల సరాసరి ధరలు. సాధారణంగా ప్రభుత్వ ధరలు కంటే పైన రిటైల్ మార్కెట్ లో కనీసం 10% ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు కదా?
ఇక రెండోది మొన్న జులై 1 నుండి కొత్త #GST రేట్లు పెరిగిన తరువాత జులై 22 నేను కొన్న డి మార్ట్ లో కొన్న సరుకుల బిల్లు. మూడోది మద్దతు ధరల చార్ట్.
నేను పరిశీలించిన మీదట చాలా వాటి ధరలు వంట నూనెలు మినహాయించి 8 సం. ల కిందట ఎలా ఉన్నాయో ఇప్పుడూ సుమారు అలాగే ఉన్నాయి. మనం ఎప్పటికి అప్పుడు మరిచిపోతాం.
అప్పుడు మీ ఆదాయాలు. అప్పటి ధరలు,
ఇప్పుడు మీ ఆదాయాలు. ఇప్పటి ధరలు సరిపోల్చి చూడండి.. ఎంత తేడా ఉందొ మీకే అర్ధం అవుతుంది. ఇప్పుడు ధరలు భయంకరంగా పెరిగాయా లేదా అన్నది మీరే నిర్ణయించుకోండి.
2014 లో సాధారణ A క్లాస్ బియ్యం మద్దతు ధర ₹1345. కేరళ లిస్టు ప్రకారం అప్పుడు రిటైల్ లో కేజీ ₹34.60 ఉన్నాయి. ఇప్పుడు అదే A క్లాస్ బియ్యం మద్దత్తు ధర ₹1960 రిటైల్ ధర ₹40 ఉంది. అంటే మద్దతు ధర ₹600 అంటే మద్దత్తు ధర 45% పెరిగింది. అలాగే అప్పటి రిటైల్ రేట్ మీద 45% పెంచితే ₹50 ఉండాలి. అలాగే మిగతా రవాణా ఖర్చులు విద్యుత్, జీతాలు మొదలగు ఖర్చులు కూడా కలిపితే ప్రస్తుతం బియ్యం కనీస ధర కేజికి ₹50 వుండాలి. కానీ టాప్ వెరైటీ తప్పితే మిగతావి 25kg లు బస్తా ₹950 -1100 మధ్య దొరుకుతోంది.
ఇక వంట నూనె ధరలు. 2013లో వేరుశనగ నూనె లీటర్ ₹136, రిఫైండ్ ఆయిల్ ₹95,నువ్వుల నూనె ₹191. మోడీ 2014లో వచ్చేసరికి వేరుశనగ నూనె ₹117, రీఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ 92, నువ్వుల నూనె 192.
అప్పుడు వేరుశనగ మాద్దత్తు ధర 4000, ఇప్పుడు 5550, అంటే 40%పెంచారు. అప్పుడు నూనె 117 మీద 40%పెంచితే ₹47 అంటే ఇప్పుడు లీటర్ ₹164 వుండాలి. ఎంత వుంది?
అలాగే సన్ ఫ్లవర్ మద్దతు ధర 3700 ఇప్పుడు 6000 అంటే 60%మద్దతు ధర పెరిగింది. అంటే అప్పుడు లీటర్ 92 మీద 60%పెరిగితే ₹55ఎక్కువ పెరగాలి, అంటే ఇప్పుడు రిటైల్ లో కనీసం లీటర్ 147ఉండాలి. ఎంత వుంది?
అలాగే కంది పప్పు మద్దత్తు ధర 2014లో ₹4300. అప్పుడు రిటైల్ ధర ₹76
ఇప్పుడు మద్దత్తు ధర ₹6300. అంటే మద్దత్తు ధర సుమారు 48% పెరిగింది. అంటే రిటైల్ ధర 48% శాతం పెరిగితే ₹115మధ్య ఉండాలి. ఎంత ఉంది? నా బిల్ ప్రకారం kg ₹104 ఉంది
ఒక్క కంది పప్పు మాత్రమే కాదు అన్ని పప్పుల ధరలు కొన్ని సం.ల క్రిందట అప్పటి అదాయాలకు ఎక్కువగా ఉండేవి. మనం సింపుల్ గా మరిచిపోయాం.
కొన్ని సార్లు కందిపప్పు, శనగ పప్పు కూడా kg ₹180-200 మనం కొనుక్కునట్లు నాకు గుర్తు.
మరో ముఖ్య వస్తువు పంచదార 2014లో
దాని ధర kg ₹34.30 . అప్పుడు చెరుకు మద్దత్తు ధర ₹210.. మరి ఇప్పుడు మద్దత్తు ధర ₹305. రిటైల్ లో ఎంతకు కొంటున్నారు? అంటే ₹35-45 మధ్య.
ఒక వైపు కరోనా తో ప్రపంచములో చాలా దేశాల్లో ఆహార కొరత ఏర్పడి ఇబ్బందులు పడితే మన దేశం 80 కోట్ల మందికి 20 నెలలు కుటుంబంలో ఒక్కో సభ్యునికి నెలకు 5కేజీ లు చొప్పున ఉచిత రేషన్ 20 నెలలకు పైగా ఇచ్చింది.
అంత కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఎక్కడా ఆహార వస్తువులు దొరకడం లేదు షాప్ లు లూటీ చేశారు అనే వార్తలు చూడలేదు.
కొసమెరుపు: ₹20 పెట్టి ఐస్ క్రీం కొనే పట్టణ మధ్యతరగతి వాళ్ళు ధరలు పెరుగుతున్నాయి అని గొడవ చేయడం
ఏమిటీ? అని అప్పటి ఆర్థికశాఖ మంత్రి చిదంబరం మధ్య తరగతి వాళ్ళను వెక్కిరించారు.
https://m.timesofindia.com/india/Food-prices-rose-157-between-2004-and-2013/articleshow/22777817.cms
….చాడా శాస్త్రి….