భారత దేశానికి పాశ్చాత్య క్రిస్టియన్ దేశాలు చెప్పే సెక్యూలర్ పాఠాలు దృష్టిలో ఉంచుకుని అసలు పాశ్చాత్య దేశాలు ఎంత వరకు సెక్యూలర్ దేశాలో పరిశీలిద్దాం.
యూరోప్లోని 32 దేశాలు క్రైస్తవ మతాన్ని అధికారికంగా వివిధ స్థాయిలలో (varying degrees) రాష్ట్ర మతంగా లేదా రాజ్యాంగంలో ప్రత్యేక అధికారాలతో లేదా వాటికన్తో ఒప్పందాలు ద్వారా అధికారికంగా గుర్తించాయి. చర్చిలను పరిపాలించడానికి, వాటి ప్రయోజనాలను రక్షించడానికి ఆయా దేశాలు వాటికన్తో కుదుర్చుకున్న ఒప్పందాలను కాంకోర్డాట్లు అంటారు.
మొదటగా USA గురించి చూద్దాం. అమెరికా యొక్క అధికారిక నినాదం “దేవునిపై మేము విశ్వాసం ఉంచుతున్నాం” అన్నది. దాని 50 రాష్ట్ర రాజ్యాంగాలు “దేవుడు” అనే పదాన్ని పలు సార్లు పేర్కొన్నాయి. ఆ దేవుడు ఏ దేవుడనేది అందరికి తెలుసు. ఆ దేశ అధ్యక్షులు బైబిల్పై ప్రమాణం చేస్తారు. ప్రతి సంవత్సరం చర్చిలో జరిగే జాతీయ ప్రార్థన బ్రేక్ఫాస్ట్లకు హాజరవుతారు. అయినప్పటికీ ప్రపంచానికి US “ఉదారవాద & సెక్యులర్ ” దేశం.
ఇక బ్రిటన్ గూర్చి – బ్రిటన్ జెండాపై క్రాస్ గుర్తు ఉంది. ఇంగ్లాండ్లో అధికారిక రాష్ట్ర మతం ఉంది అదే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇది జీసస్ మాత్రమే దేవుడని నమ్ముతుంది. 21వ శతాబ్దంలో ఇంగ్లండ్ ఇప్పటికీ క్రైస్తవ రాజ్యంగా ఎందుకు ఉంది అని ఎప్పుడైనా ఏ పాశ్చాత్య ఉదారవాది గానీ అడిగారా? కానీ భారతదేశం 4 ప్రపంచ మతాలకు జన్మనిచ్చినప్పటికీ వలసవాద సెక్యులరిజం యొక్క నిర్వచనాలు భారత్ భరించవలసి వస్తోంది. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్లోని బిషప్ల కోసం UK పార్లమెంట్లో 26 సీట్లు కేటాయించబడ్డాయి. 2015 వరకు, 400 సంవత్సరాలుగా ఒక్క మహిళా బిషప్ కూడా ఎంపిక కాలేదు. అయితే 4 శతాబ్దాల పాటు శ్వేతజాతి క్రైస్తవ పురుషులకు ప్రత్యేకంగా పార్లమెంటులో కొంత భాగాన్ని కేటాయించినా కూడా UK యొక్క ప్రజాస్వామ్య, సెక్యూలర్, లింగ వివక్ష లేని దేశంగా ఉన్న ఖ్యాతి చెక్కుచెదరలేదు.
భారత్ లో కొందరు హిందూ మత పెద్దలకు ఇలాగే పార్లమెంట్ లో సీట్లు కేటాయించి ఉంటే ఇదే బ్రిటన్ ఎంత వెక్కిరించి ఉండేదో?
ఇక US/UK దాటి చూస్తే 2006లో జర్మనీ క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా యూరోపియన్ యూనియన్ రాజ్యాంగం కోసం ప్రపోజల్ తెచ్చింది. ఇటలీ, పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాలు తమ చర్చిలతో ప్రత్యేక సంబంధాలను కలిగి ఉన్నాయి, ఫ్రాన్స్లో చర్చి కి దేశానికి తేడా వర్తించని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అన్ని నార్డిక్ దేశాలు అంటే ఫిన్లాండ్, స్కాండనేవియ, ఐస్లాండ్ వంటి దేశాలు చర్చిలను అధికారికంగా నడుపుతున్నాయి.
ఇక అరబ్ దేశాలు ఎలాగూ తమ ఇస్లాం వాదాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తుండగా, ఐరోపా తన క్రైస్తవ గుర్తింపును లౌకికవాదం ముసుగులో మభ్యపెడుతూ నిగూఢంగా వ్యవహరిస్తోంది. ఈ తరహా లౌకిక వాద ముసుగు వారికి ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో మెరుగైన నైతిక బలాన్ని అందిస్తోంది. అంతే కాక ఇది తెల్లవారి బలమైన క్రిస్టియన్ భావన కలిగి ఉంది. అందుకే ఈ దేశాలు ఉక్రెయిన్ కి సోదరభావంతో మద్దత్తు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాము.
పాశ్చాత్య దేశాలు ఏ మాత్రం సిగ్గుపడకుండా మా దేవుడు తప్ప మరో దేవుడు లేడు అనే ఎడారి మతాలు ఫాలో అవుతూ సర్వ మత సమభావ ధర్మాన్ని బోధించే హిందూ ధర్మం పాటించే మెజార్టీ ప్రజలు ఉన్న భారత్ ని మాత్రం మత తత్వ దేశం అని నిర్లజ్జగా ఆరోపిస్తూ సెక్యూలర్ పాఠాలు చెపుతున్నారు. దానికి ఇక్కడ వామ పక్షాల వారు, ఉదారవాద హిందువులు వంత పాడతున్నారు.
అందుకే భారత్ , భారత ప్రజలు కూడా ఏమాత్రం సిగ్గు పడకుండా ఈ దేశ సాంస్కృతికకు మూలాధారమైన హిందూ ధర్మాన్ని నిస్సంకోచంగా పాటిస్తూ దానిని రక్షించుకోవాలి.
Courtesy :- Chada Sastry