బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటినుంచి మొదలైన హింస ఇప్పట్లో ఆగేట్టు లేదు. తాజాగా కేంద్రమంత్రి వి. మురళీధరన్ కారుపై దాడి జరిగింది. మిడ్నాపూర్లో పంచకుడిలో తన కాన్వాయ్ పై దాడి చేశారని… కారు అద్దాలు ధ్వంసం చేశారని… తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాడికి సంబంధించిన వీడియోనూ ఆయన తన ట్వీట్ కు జత చేశారు. దాడిచేసింది టీఎంసీ గూండాలేననీ అన్నారు. ఈ దాడితో ఆయన తన పర్యటనను అర్థంతరంగా ముగించుకుని వెనుదిరిగారు.అటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు.