SSC టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి ఏజెన్సీ ద్వారా సమన్లు అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఈరోజు కోల్కతాలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పార్థ ఛటర్జీ అరెస్ట్ అయిన వెంటనే మాణిక్ కు సమన్లు వచ్చాయి.
బెంగాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ప్రెసిడెంట్ పదవి నుంచి భట్టాచార్యను ఇటీవల కోర్టు ఆదేశంతో తొలగించారు. ఇటీవల భట్టాచార్య నివాసంలో నిర్వహించిన దాడుల్లో రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించిన పలు కీలక పత్రాలను ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. ఈ పత్రాలకు సంబంధించి భట్టాచార్యను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తెలిపింది.