పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతర అల్లర్లపై విచారణకు వెళ్లిన కమిటీ బృందాలపై తృణమూల్ కార్యకర్తలు దాడికి దిగడం ఉద్రిక్తమైంది..
హైకోర్ట్ ఆదేశంతో జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు, జాతీయ మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ అతిఫ్ రషీద్ తో కూడిన బృందం ఎంక్వైరీలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తోంది..పర్యటనలో భాగంగా విచారణకమిటీ అల్లర్లలో 40 ఇళ్లు ధ్వంసమైన జాదవపూర్ వెళ్లింది..అయితే అక్కడ వారిని అధికారపార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బెంగాల్లో అరాచకపాలన సాగుతోందని స్వయంగా చూశామని రషీద్ మండిపడ్డారు..ఎంక్వైరీ కమిటీకే పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని..ఇక సామాన్యుల పరిస్థితేంటని బృందం ఆందోళన వ్యక్తం చేసింది..