దేశంలో ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్టీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉంటారని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. సీఎం మమతా బెనర్జీ నివాసంలో జరిగిన ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
“ఉభయ సభల్లో 35 మంది ఎంపీలు ఉన్న పార్టీతో సరైన సంప్రదింపులు, చర్చలు జరపకుండానే ప్రతిపక్ష అభ్యర్థిని కాంగ్రెస్కు చెందిన మార్గరెట్ అల్వా నిర్ణయించిన కారణంగా ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని మేం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. దాదాపు 85% మంది ఎంపీలు పార్టీ చైర్పర్సన్ శ్రీమతి బెనర్జీని ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలని కోరారు” అని సమావేశం అనంతరం తృణమూల్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చెప్పారు.
ఈ పరిస్థితికి టీఎంసీ కాంగ్రెస్ను బాధ్యులను చేస్తుందా.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది ప్రతిపక్ష ఐక్యతను బలహీనపరుస్తుందా అని అడిగగా.. అభిషేక్ బెనర్జీ ఇలా అన్నారు, మేం 3 నుంచి 4 పేర్లను ప్రతిపాదించాం.. సంప్రదింపులు జరుగుతున్నాయి, కానీ అంతలోనే టీఎంసీతో చర్చించకుండానే అభ్యర్థిని ప్రకటించారు. తొలుత కాంగ్రెస్ సంప్రదింపుల కోసం సమావేశానికి పిలిచిందని.. అయితే అకస్మాత్తుగా వేదిక మార్చారు.. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నివాసంలో సమావేశం జరిగిందని అభిషేక్ అన్నారు.
అల్వా, మమతా బెనర్జీలు చాలా మంచి సఖ్యత కలిగి ఉన్నారని.. అయితే ఉపరాష్ట్రపతి ఎంపిక వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి ఉండదని టీఎంసీ నాయకులు చెప్పారు.
“ఏదేమైనా ప్రతిపక్షాల ఐక్యతకు ఈ చర్య సరైనది కాదు. కానీ ప్రతిపక్ష ఐక్యత లేదని దీని అర్థం కాదు.. ఎందుకంటే అది రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పరిమితం కాదు. పెద్ద పోరాటం నది రోడ్డు మీద ఉంటుంది. మనం మన అహాలను అధిగమించాలి’ అని అభిషేక్ బెనర్జీ అన్నారు.