వెస్ట్ బెంగాల్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార టీఎంసీ,బీజేపీ మధ్య మాటలయుద్దమే కాదు.. ప్రత్యేక్ష దాడులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ లక్ష్యంగా టీఎంసీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో దుర్గాపూర్ జిల్లాలోని బసుద ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
టీఎంసీ గుండాలు వచ్చి బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని.. ప్రజలంతా బీజేపీతో ఉండటాన్ని టీఎంసీ గుండాలు ఓర్వలేకపోతున్నారని స్థానిక బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ పార్టీకి చెందిన గుండాలే ధ్వంసం చేశారని ఆరోపించారు.
West Bengal: Bharatiya Janata Party (BJP) office in Basudha area of Durgapur was allegedly vandalised by TMC workers yesterday.
"TMC goons have vandalised our office. If they think BJP can be stopped by such attacks then they are wrong. People are with us", said a BJP worker pic.twitter.com/JYL9IdH9DO
— ANI (@ANI) April 9, 2021