ఉత్తరప్రదేశ్లో తిరంగ శాఖలను ప్రారంభించడం గురించి ఆప్ ప్రకటించిన ఒక రోజు తర్వాత, జాతీయవాదం గురించి తెలుసుకోవడానికి నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ నేత పర్వేశ్ సాహిబ్ సింగ్ ఆహ్వానించారు. “జాతీయవాదం మన హృదయంలో, మనస్సులో ఉండాలి. ఆయన ఎంత జాతీయవాదో మాకు తెలుసు. ఆయన సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతాడు.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ని వ్యతిరేకిస్తాడు. మరి ఢిల్లీ, పటియాలాలో తన ప్రభుత్వ హయాంలో జరిగిన అల్లర్ల గురించి ఏం సమాధానం చెబుతారు” అని ఆయన ప్రశ్నించారు.
ఆర్ఎస్ఎస్ తరహాలో యూపీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ తిరంగ శాఖలను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సంజయ్ సింగ్ శనివారం తెలిపారు. BJP “విభజించు – పాలించు” విధానం గురించి UP ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆప్ 10,000 తిరంగ శాఖలను తెరవాలని భావిస్తోందని రాజ్యసభ MP తెలిపారు.